కడప జిల్లా వేంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో.... షేక్ నున్న సాహెబ్ అనే వ్యక్తికి చెందిన మూడు చెక్కడిపోలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న ఒక వెల్డింగ్ దుకాణం, 2 ద్విచక్రవాహనాలు మంటలకు ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా శ్రమించినా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనలో... చెక్కడిపోల్లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. షార్ట్సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: కరోనా రోగిని కాపాడేదిలా..