ETV Bharat / state

'రాజకీయాల్లో ఉన్నంత వరకు వైకాపాను వీడను' - పార్టీ మారడంపై కడపలో స్పందించిన మాజీమంత్రి

వైకాపాను వీడేది లేదని మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తెలిపారు. అన్నీ ఆలోచించుకునే తెదేపా నుంచి బయటకు వచ్చినట్లు.. కడప జిల్లా జమ్మలమడుగులో మీడియాకు వివరించారు. మొదట్లో పార్టీ శ్రేణుల నుంచి సరైన స్పందన రాకపోవడం సహజమేనని అభిప్రాయపడ్డారు.

ex minister press meet
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి
author img

By

Published : Nov 5, 2020, 6:56 PM IST

రాజకీయాల్లో ఉన్నంత వరకు వైకాపాను వీడేది లేదని మాజీమంత్రి, వైకాపా నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి కార్యక్రమాలకు పిలుపులు రావడం లేదన్న విషయం వాస్తవమేనన్నారు.

కొత్తగా పార్టీలో చేరడంతో ఇలాంటి సమస్యలు వస్తుంటాయని.. త్వరలో అన్నీ సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నిటికీ సిద్ధపడే తెదేపా నుంచి వచ్చానని వెల్లడించారు. ఈ విషయంపై ఎటువంటి పునరాలోచన లేదని పేర్కొన్నారు.

రాజకీయాల్లో ఉన్నంత వరకు వైకాపాను వీడేది లేదని మాజీమంత్రి, వైకాపా నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి కార్యక్రమాలకు పిలుపులు రావడం లేదన్న విషయం వాస్తవమేనన్నారు.

కొత్తగా పార్టీలో చేరడంతో ఇలాంటి సమస్యలు వస్తుంటాయని.. త్వరలో అన్నీ సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నిటికీ సిద్ధపడే తెదేపా నుంచి వచ్చానని వెల్లడించారు. ఈ విషయంపై ఎటువంటి పునరాలోచన లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

జమ్మలమడుగులో ఒక్క సచివాలయం కూడా లేకపోవటం అవమానకరం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.