రాయచోటిలో కొవిడ్ కేర్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియ ఖానాం.. కేర్ సెంటర్ను ప్రారంభించారు. మూడు వందల పడకలతో అన్ని వసతులు.. కలిగిన సెంటర్ను ఏర్పాటు చేసినట్లు శ్రీకాంత్రెడ్డి చెప్పారు. ఈ కేంద్రం స్థానికులకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
కొవిడ్ బాధితులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కేంద్రంలో ముగ్గురు వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. అత్యవసరమైతే.. ఇక్కడ నయం కాని వారికి ప్రత్యేక వాహనంలో కడపలోని కొవిడ్ ఆసుపత్రికి తరలిస్తారని చెప్పారు.
ఇదీ చదవండి: