ETV Bharat / state

మిద్దె కూలి దంపతులు దుర్మరణం

author img

By

Published : Sep 16, 2020, 3:27 PM IST

మట్టి మిద్దె కూలి దంపతులు మృతి చెందిన ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలం కులూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి మృతుడు శ్రీనివాస్ తల్లి, కుమార్తె తృటిలో తప్పించుకున్నారు.

couple dead in Midday collapsed
మిద్దె కూలి దంపతులు దుర్మరణం


కడప జిల్లా రాజుపాలెం మండలం కులూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిద్దె పూర్తిగా తడవడంతో ఈ తెల్లవారుజామున పైకప్పు కూలిపోయింది. ఆ గదిలో నిద్రిస్తున్న పెద్దిరెడ్డి శ్రీనివాసులు, సావిత్రి దంపతులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. మరో గదిలో ఉన్న శ్రీనివాసులు తల్లి, కుమార్తె ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో కుమార్తె సాయిశ్రీ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. రాజుపాలెం ఎస్ఐ లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు.


కడప జిల్లా రాజుపాలెం మండలం కులూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిద్దె పూర్తిగా తడవడంతో ఈ తెల్లవారుజామున పైకప్పు కూలిపోయింది. ఆ గదిలో నిద్రిస్తున్న పెద్దిరెడ్డి శ్రీనివాసులు, సావిత్రి దంపతులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. మరో గదిలో ఉన్న శ్రీనివాసులు తల్లి, కుమార్తె ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో కుమార్తె సాయిశ్రీ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. రాజుపాలెం ఎస్ఐ లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు.

ఇవీ చూడండి...

ఉపముఖ్యమంత్రికి తప్పని అడుసు పాట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.