ETV Bharat / state

'పంట నష్టపోయిన రైతులందరికి నెలాఖరులోగా పరిహారం'

author img

By

Published : Dec 7, 2020, 10:58 PM IST

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన కడప జిల్లా రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రులు ఆదిమూలపు సురేశ్, అంజాద్ బాషా స్పష్టం చేశారు. కలెక్టరేట్​లో తుపాను నష్టంపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రులు... లక్షా 40 వేల హెక్టార్లలో పంటనష్టం సంభవించిందని అంచనా వేశారు. ఈనెలలోనే బాధిత రైతులకు పరిహారం అందుతుందని భరోసానిచ్చారు. తెగిపోయిన ప్రాజెక్టులను ఆధునీకరించడానికి టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు.

పంట నష్టపోయిన రైతులందరికి నెలాఖరులోగా పరిహారం
పంట నష్టపోయిన రైతులందరికి నెలాఖరులోగా పరిహారం

కడప జిల్లాలో నివర్ తుపాను ప్రభావంపై కలెక్టరేట్​లో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, వైకాపా ఎమ్మెల్యేలు, తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాలో శనగ పంటకు వందశాతం నష్టం జరిగిందని వైకాపా ఎమ్మెల్యేలు, తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి సమీక్షలో ప్రస్తావించారు. పులివెందుల నియోజకవర్గంలో శనగ పూర్తిగా నాశనమైందని..,హెక్టారుకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. బత్తాయి, బొప్పాయి, అరటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు అధికారులు నిర్లక్ష్యం వల్ల కోతకు గురయ్యాయని సభ్యులు ప్రస్తావించారు. బుగ్గవంక బాధితులకు తక్షణం 25 వేల ఆర్థికసాయం ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

ప్రాజెక్టు ఆధునీకరణకు త్వరలో టెండర్లు

నివర్ తుపాను ప్రభావంతో అన్ని మండలాల్లో లక్షా 42 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని..,వారం లోపు పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని మంత్రి సురేశ్ అధికారులను ఆదేశించారు. 33 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం ఇస్తారనే నిబంధన పక్కనపెట్టి...ఉదారంగా అంచనా వేసి రైతులకు మేలు చేయాలన్నారు. పింఛ, అన్నమయ్య, బుగ్గవంక ఆధునీకరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని అన్నారు. బుగ్గవంక ప్రవాహంతో నిరాశ్రయులైన 20 వేల మందికి రూ. 500 తక్షణ సాయం అందించామన్నారు. పింఛ ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కులు పైగానే ప్రవాహం రావడంతోనే కట్ట కోతకు గురైందన్నారు.

బుగ్గవంకకు రక్షణ గోడ

బుగ్గవంక రక్షణ గోడల కోసం ముఖ్యమంత్రి రూ.39 కోట్లు మంజూరు చేశారని..,1.2 కిలోమీటర్ల మధ్యలో ఉన్న కట్టడాలను తప్పనిసరిగా తొలగిస్తామని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. గతంలో చేసిన సర్వే కాకుండా ప్రస్తుతం మరోసారి సర్వేచేసి నూతనంగా నిర్మించిన కట్టడాలు ఏమైనా ఉంటే గుర్తిస్తామన్నారు. తప్పనిసరిగా రక్షణగోడలు నిర్మించి తీరుతామన్నారు. ఈనెల 15 లోపు అధికారులు పంటనష్టం అంచనాలు తయారు చేస్తే...30లోపు బాధిత రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

మీడియాకు అనుమతి నిరాకరణ..కాసేపు గందరగోళం

సమీక్షా సమావేశం ప్రారంభం కాగానే వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేశ్, కలెక్టర్ హరికిరణ్​కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశానికి మీడియాను అనుమతించకపోవటం పట్ల ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను అనుమతించక పోతే తాను సభ నుంచి వెళ్లిపోతానని భీష్మించారు. దీంతో చివరికి మీడియాను అనుమతించారు. అనంతరం తనకు నాలుగేళ్లపాటు ఎమ్మెల్యే వేతనంగా వచ్చే కోటి రూపాయలను తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు అందజేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సభలో ప్రకటించారు.

ఇదీచదవండి

'సీఎం ఏలూరు పర్యటనలో పెళ్లి వేడుకకే ప్రాధాన్యం ఇచ్చారు'

కడప జిల్లాలో నివర్ తుపాను ప్రభావంపై కలెక్టరేట్​లో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, వైకాపా ఎమ్మెల్యేలు, తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాలో శనగ పంటకు వందశాతం నష్టం జరిగిందని వైకాపా ఎమ్మెల్యేలు, తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి సమీక్షలో ప్రస్తావించారు. పులివెందుల నియోజకవర్గంలో శనగ పూర్తిగా నాశనమైందని..,హెక్టారుకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. బత్తాయి, బొప్పాయి, అరటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు అధికారులు నిర్లక్ష్యం వల్ల కోతకు గురయ్యాయని సభ్యులు ప్రస్తావించారు. బుగ్గవంక బాధితులకు తక్షణం 25 వేల ఆర్థికసాయం ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

ప్రాజెక్టు ఆధునీకరణకు త్వరలో టెండర్లు

నివర్ తుపాను ప్రభావంతో అన్ని మండలాల్లో లక్షా 42 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని..,వారం లోపు పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని మంత్రి సురేశ్ అధికారులను ఆదేశించారు. 33 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం ఇస్తారనే నిబంధన పక్కనపెట్టి...ఉదారంగా అంచనా వేసి రైతులకు మేలు చేయాలన్నారు. పింఛ, అన్నమయ్య, బుగ్గవంక ఆధునీకరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని అన్నారు. బుగ్గవంక ప్రవాహంతో నిరాశ్రయులైన 20 వేల మందికి రూ. 500 తక్షణ సాయం అందించామన్నారు. పింఛ ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కులు పైగానే ప్రవాహం రావడంతోనే కట్ట కోతకు గురైందన్నారు.

బుగ్గవంకకు రక్షణ గోడ

బుగ్గవంక రక్షణ గోడల కోసం ముఖ్యమంత్రి రూ.39 కోట్లు మంజూరు చేశారని..,1.2 కిలోమీటర్ల మధ్యలో ఉన్న కట్టడాలను తప్పనిసరిగా తొలగిస్తామని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. గతంలో చేసిన సర్వే కాకుండా ప్రస్తుతం మరోసారి సర్వేచేసి నూతనంగా నిర్మించిన కట్టడాలు ఏమైనా ఉంటే గుర్తిస్తామన్నారు. తప్పనిసరిగా రక్షణగోడలు నిర్మించి తీరుతామన్నారు. ఈనెల 15 లోపు అధికారులు పంటనష్టం అంచనాలు తయారు చేస్తే...30లోపు బాధిత రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

మీడియాకు అనుమతి నిరాకరణ..కాసేపు గందరగోళం

సమీక్షా సమావేశం ప్రారంభం కాగానే వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేశ్, కలెక్టర్ హరికిరణ్​కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశానికి మీడియాను అనుమతించకపోవటం పట్ల ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను అనుమతించక పోతే తాను సభ నుంచి వెళ్లిపోతానని భీష్మించారు. దీంతో చివరికి మీడియాను అనుమతించారు. అనంతరం తనకు నాలుగేళ్లపాటు ఎమ్మెల్యే వేతనంగా వచ్చే కోటి రూపాయలను తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు అందజేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సభలో ప్రకటించారు.

ఇదీచదవండి

'సీఎం ఏలూరు పర్యటనలో పెళ్లి వేడుకకే ప్రాధాన్యం ఇచ్చారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.