ETV Bharat / state

బుగ్గవంక సుందరీకరణ పనుల్లో జాప్యం... ఆక్రమణలే కారణమా! - Kadapa latest news

అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే కడప బుగ్గవంక సుందరీకరణ పనులు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల కూల్చివేతలో పెద్దల జోలికి వెళ్లకుండా... పేదలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అధికారులు ప్రతాపం చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బుగ్గవంక సుందరీకరణ జాప్యానికి సీఎం బంధువు థియేటర్‌ను కూల్చకపోవడమే కారణమంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Buggavanka beautification works pending
బుగ్గవంక సుందరీకరణ పనుల్లో జాప్యం
author img

By

Published : May 26, 2021, 12:54 PM IST

బుగ్గవంక సుందరీకరణ పనుల్లో జాప్యం

2001 సెప్టెంబరులో వచ్చిన భారీ వరదలతో కడప బుగ్గవంక పోటెత్తి.. సగం వరకు కడప నగరం మునిగిపోయింది. పదుల సంఖ్యలో జనాలు మృత్యువాత పడగా... కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో బుగ్గవంక సుందరీకరణ చేపట్టాలని నిర్ణయించి.. 35 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆక్రమణలు తొలగించకుండా బుగ్గవంక సుందరీకరణ చేపట్టడం సాధ్యం కాదనే ఉద్దేశంతో.. రెండు గుత్తేదారు సంస్థలు చేతులెత్తేశాయి.

ప్రస్తుతం బుగ్గవంకకు రెండు వైపుల 40 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించేందుకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ పనులు చేయాలంటే బుగ్గవంకకు రెండు వైపుల ఉన్న 119 అక్రమ కట్టడాలను తొలగించాలి. ఇందులో 39 వరకు నివాసాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ స్థలంలో నిర్మించినవేనని అధికారులు చెబుతున్నారు. నెలరోజుల గడువు ఇచ్చిన తర్వాత.. మూడు రోజుల నుంచి కూల్చివేత పనులు చేస్తుండగా.. సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గుర్రాలగడ్డ వద్ద ఇళ్లు కూల్చే సమయంలో నీటిపారుదలశాఖ అధికారిపై నిర్వాసితులు దాడి చేశారు.

బుగ్గవంక సుందరీకరణ పనులు పూర్తికాక పోవడానికి ప్రధాన కారణం.. సీఎం జగన్‌ బంధువు రవీంద్రనాథ్ రెడ్డి థియేటరే కారణం అని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. బుగ్గవంకను ఆనుకుని థియేటర్ ఉన్న కారణంగా ఎవరూ వాటిని కూల్చడానికి సాహసించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పేదలకు ఇళ్లు చూపించకుండా ఉన్న ఫలంగా ఇళ్లు కూల్చివేస్తే... వారు ఎక్కడికి పోతారని ప్రజాసంఘాలు మండిపడ్డాయి.

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న ఇళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఇవ్వడం కుదరదని అధికారులు అంటున్నారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారనే కారణంతో పునరావాసం కల్పిస్తామని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ఆ గ్రామాల పొలిమేర తాకని మహమ్మారి..

బుగ్గవంక సుందరీకరణ పనుల్లో జాప్యం

2001 సెప్టెంబరులో వచ్చిన భారీ వరదలతో కడప బుగ్గవంక పోటెత్తి.. సగం వరకు కడప నగరం మునిగిపోయింది. పదుల సంఖ్యలో జనాలు మృత్యువాత పడగా... కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో బుగ్గవంక సుందరీకరణ చేపట్టాలని నిర్ణయించి.. 35 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆక్రమణలు తొలగించకుండా బుగ్గవంక సుందరీకరణ చేపట్టడం సాధ్యం కాదనే ఉద్దేశంతో.. రెండు గుత్తేదారు సంస్థలు చేతులెత్తేశాయి.

ప్రస్తుతం బుగ్గవంకకు రెండు వైపుల 40 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించేందుకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ పనులు చేయాలంటే బుగ్గవంకకు రెండు వైపుల ఉన్న 119 అక్రమ కట్టడాలను తొలగించాలి. ఇందులో 39 వరకు నివాసాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ స్థలంలో నిర్మించినవేనని అధికారులు చెబుతున్నారు. నెలరోజుల గడువు ఇచ్చిన తర్వాత.. మూడు రోజుల నుంచి కూల్చివేత పనులు చేస్తుండగా.. సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గుర్రాలగడ్డ వద్ద ఇళ్లు కూల్చే సమయంలో నీటిపారుదలశాఖ అధికారిపై నిర్వాసితులు దాడి చేశారు.

బుగ్గవంక సుందరీకరణ పనులు పూర్తికాక పోవడానికి ప్రధాన కారణం.. సీఎం జగన్‌ బంధువు రవీంద్రనాథ్ రెడ్డి థియేటరే కారణం అని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. బుగ్గవంకను ఆనుకుని థియేటర్ ఉన్న కారణంగా ఎవరూ వాటిని కూల్చడానికి సాహసించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పేదలకు ఇళ్లు చూపించకుండా ఉన్న ఫలంగా ఇళ్లు కూల్చివేస్తే... వారు ఎక్కడికి పోతారని ప్రజాసంఘాలు మండిపడ్డాయి.

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న ఇళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఇవ్వడం కుదరదని అధికారులు అంటున్నారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారనే కారణంతో పునరావాసం కల్పిస్తామని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ఆ గ్రామాల పొలిమేర తాకని మహమ్మారి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.