ETV Bharat / state

రైల్వే కోడూరులో బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

author img

By

Published : Nov 17, 2020, 8:29 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరులో ఓ మైనర్ వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఘటనపై బాలిక తల్లిదండ్రులకు కౌన్సలింగ్ చేశారు. చిన్నవయసులో వివాహం చేయటం వల్ల వచ్చే అనర్థాలను వారికి వివరించారు.

రైల్వే కోడూరులో బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
రైల్వే కోడూరులో బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు


కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో పోలీసులు ఓ మైనర్ వివాహన్ని అడ్డుకున్నారు. పట్టణానికి చెందిన బాలకృష్ణ, విజయలక్ష్మి దంపతులు. వీరికి 5 మంది ఆడపిల్లలు, ఒక కుమారుడు. చిన్నచిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో పెద్ద అమ్మాయికి 16 ఏళ్లు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు.

ఓబులవారిపల్లె మండలం కటికంవారి పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తితో బుధవారం వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులందరికీ పెళ్లి పత్రికలు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీసీ అధికారులు, పోలీసులు వారి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్​కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.


కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో పోలీసులు ఓ మైనర్ వివాహన్ని అడ్డుకున్నారు. పట్టణానికి చెందిన బాలకృష్ణ, విజయలక్ష్మి దంపతులు. వీరికి 5 మంది ఆడపిల్లలు, ఒక కుమారుడు. చిన్నచిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో పెద్ద అమ్మాయికి 16 ఏళ్లు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు.

ఓబులవారిపల్లె మండలం కటికంవారి పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తితో బుధవారం వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులందరికీ పెళ్లి పత్రికలు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీసీ అధికారులు, పోలీసులు వారి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్​కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఇవీ చదవండి:

గోశాలకు మూగజీవాల తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.