ETV Bharat / state

'పాఠశాల స్థలంలో కూరగాయల మార్కెట్​.. సరికాదు' - ప్రొద్దుటూరు మార్కెట్​పై హైకోర్టు వ్యాఖ్యలు

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాల ప్రాంగణంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాఠశాల ప్రాంగణంలో మార్కెట్‌ ఏర్పాటు సరికాదని స్పష్టం చేసింది.

AP high court comments on vegetable market at prodhuturu government  school
AP high court comments on vegetable market at prodhuturu government school
author img

By

Published : Jul 1, 2021, 8:14 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాల ప్రాంగణంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్కెట్‌ ఏర్పాటు పేరుతో మొదట ఆటస్థలాన్ని తీసుకున్నారని, తర్వాత పాఠశాలను తీసుకునే అవకాశం లేకపోలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పాఠశాల ప్రాంగణంలో మార్కెట్‌ ఏర్పాటు సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. కూరగాయల మార్కెట్ ముఖ్యమే కాని.. అంతకంటే విద్యార్థులకు పాఠశాల ముఖ్యం అని పేర్కొంది.

న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపట్టారని, ఈ విషయంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేస్తున్నామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పగా.. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ప్రొద్దుటూరులోని డాక్టర్ అనిబీసెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారని.. ఆ ప్రక్రియను అడ్డుకోవాలని కోరుతూ ప్రొద్దుటూరుకు చెందిన కె.బాలచంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పట్లో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఇకమీదట నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఈ వ్యాజ్యం తాజాగా హైకోర్టులో మరోసారి విచారణకు రాగా.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్త మార్కెట్ నిర్మాణం పూర్తయ్యాక అక్కడికి తరలిస్తామన్నారు. ఆ స్థలం పాఠశాలది కాదని... మున్సిపాలిటీకి చెందిందని వివరించారు. కొత్త మార్కెట్‌ను నిర్మించిన తర్వాత తాత్కాలిక నిర్మాణాలను తొలగించి అక్కడకు తరలిస్తామన్నారు.

ఇదీ చదవండి:

CM JAGAN: తెలంగాణలో మన ప్రజలున్నారు.. సామరస్యంగా పరిష్కరించుకుందాం

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాల ప్రాంగణంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్కెట్‌ ఏర్పాటు పేరుతో మొదట ఆటస్థలాన్ని తీసుకున్నారని, తర్వాత పాఠశాలను తీసుకునే అవకాశం లేకపోలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పాఠశాల ప్రాంగణంలో మార్కెట్‌ ఏర్పాటు సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. కూరగాయల మార్కెట్ ముఖ్యమే కాని.. అంతకంటే విద్యార్థులకు పాఠశాల ముఖ్యం అని పేర్కొంది.

న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపట్టారని, ఈ విషయంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేస్తున్నామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పగా.. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ప్రొద్దుటూరులోని డాక్టర్ అనిబీసెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారని.. ఆ ప్రక్రియను అడ్డుకోవాలని కోరుతూ ప్రొద్దుటూరుకు చెందిన కె.బాలచంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పట్లో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఇకమీదట నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఈ వ్యాజ్యం తాజాగా హైకోర్టులో మరోసారి విచారణకు రాగా.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్త మార్కెట్ నిర్మాణం పూర్తయ్యాక అక్కడికి తరలిస్తామన్నారు. ఆ స్థలం పాఠశాలది కాదని... మున్సిపాలిటీకి చెందిందని వివరించారు. కొత్త మార్కెట్‌ను నిర్మించిన తర్వాత తాత్కాలిక నిర్మాణాలను తొలగించి అక్కడకు తరలిస్తామన్నారు.

ఇదీ చదవండి:

CM JAGAN: తెలంగాణలో మన ప్రజలున్నారు.. సామరస్యంగా పరిష్కరించుకుందాం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.