ETV Bharat / state

చెట్టును ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి

author img

By

Published : Apr 15, 2021, 9:30 PM IST

లారీ... చెట్టును ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన కడప జిల్లా రైల్వే కోడూరులోని జ్యోతి కాలనీ సమీపంలో జరిగింది. మృతుడిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

lorry hit a tree at railway kodur
చెట్టును ఢీకొట్టిన లారీ.

కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని జ్యోతి కాలనీ సమీపంలో చెట్టును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. చెన్నై నుంచి కడపకు వెళ్తున్న లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో లారీ వూర్తిగా ధ్వంసం కాగా.. అందులో చిక్కుకున్న డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.

మృతుడిని మహారాష్ట్రలోని షోలాపూర్​కు చెందిన ధ్యానేశ్వర్ విటల్​గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేకోడూరు ఎస్సై పెద్ద ఓబన్న పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని జ్యోతి కాలనీ సమీపంలో చెట్టును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. చెన్నై నుంచి కడపకు వెళ్తున్న లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో లారీ వూర్తిగా ధ్వంసం కాగా.. అందులో చిక్కుకున్న డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.

మృతుడిని మహారాష్ట్రలోని షోలాపూర్​కు చెందిన ధ్యానేశ్వర్ విటల్​గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేకోడూరు ఎస్సై పెద్ద ఓబన్న పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

కుమారుడి మణికట్టు కోసి.. హతమార్చిన తండ్రి

భయంతో టీకాలకు దూరంగా 18వేల ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.