ETV Bharat / state

తాడేపల్లిగూడెంలో 70 ద్విచక్రవాహనాలను సీజ్.. ఎందుకంటే.. - two wheelers seized in thadepalligudem

అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేయటమే కాకుండా వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు తాడేపల్లిగూడెం పోలీసులు. లాక్​డౌన్​ అమల్లో ఉన్నందున ప్రజలు పోలీసులకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

two wheelers seized in thadepalligudem due to lockdown
తాడేపల్లిగూడెంలో ద్విచక్రవాహనాలు సీజ్ చేసిన పోలీసులు
author img

By

Published : Mar 24, 2020, 4:19 PM IST

తాడేపల్లిగూడెంలో ద్విచక్రవాహనాలు సీజ్ చేసిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ద్విచక్ర వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపించారు. నిర్లక్ష్యంగా, అవసరంలేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న 70 మంది వాహనాలను సీజ్ చేశారు. నిత్యవసరాలకోసం, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారిని మాత్రమే రహదారులపైకి అనుమతించినట్లు పట్టణ సీఐ రఘు వివరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు ఒకే చోట చేరకుండా ఉండేందుకే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం లాక్​డౌన్​ ఈ నెలాఖరు వరకు ఉంటుందనీ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ప్రజలు గడప దాటకుండా పటిష్ఠ చర్యలు

తాడేపల్లిగూడెంలో ద్విచక్రవాహనాలు సీజ్ చేసిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ద్విచక్ర వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపించారు. నిర్లక్ష్యంగా, అవసరంలేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న 70 మంది వాహనాలను సీజ్ చేశారు. నిత్యవసరాలకోసం, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారిని మాత్రమే రహదారులపైకి అనుమతించినట్లు పట్టణ సీఐ రఘు వివరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు ఒకే చోట చేరకుండా ఉండేందుకే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం లాక్​డౌన్​ ఈ నెలాఖరు వరకు ఉంటుందనీ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ప్రజలు గడప దాటకుండా పటిష్ఠ చర్యలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.