ETV Bharat / state

ఇసుక కావాలా... జేబులు గుల్ల కావాల్సిందే...! - పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక కష్టాలు

ఇసుక కొరత సామాన్యున్ని ఇబ్బందులకు గురి  చేస్తోంది. రోజుల కొద్దీ వేచిచూసినా అంతర్జాలంలో నో స్టాక్​ అనే కనబడుతోంది. దళారీలు విజృంభించి... ఇసుకను నల్లబజారులో అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారుల పట్టించుకోవడం లేదు. ఇసుక కృత్రిమ కొరతతో అటు ప్రజలు, ఇటు భవన నిర్మాణ కార్మికులు ఆవేదనకు గురవుతున్నారు. ఇసుక రీచ్​లు అధికంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక కొరతపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం...!

ఇసుక కావాలా... జేబులు గుల్ల కావాల్సిందే...!
author img

By

Published : Oct 19, 2019, 6:00 AM IST

ఇసుక కావాలా... జేబులు గుల్ల కావాల్సిందే...!

రాష్ట్రంలో 3 నెలల పాటు ఇసుక రవాణాపై నిషేధం విధించిన ప్రభుత్వం... నూతన పాలసీని తీసుకొచ్చింది. దీని వల్ల ప్రజల కష్టాలు తీరుతాయని భావించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నూతన విధానం అమలై నెలరోజులు గడుస్తున్నా... ఇసుక నేటికీ సామాన్యునికి అందని ద్రాక్షలానే మారింది. గోదావరి నదికి ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ దుస్థితి నెలకొంది.

దళారుల దందా

జిల్లాలో ఇసుక సరఫరాలో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బల్క్​గా ఇసుకను బుక్​ చేస్తూ నల్లబజారుకు తరలిస్తున్నారు. సర్కారు లెక్కల ప్రకారం 20 టన్నుల ఇసుక రూ.19,500 రూపాయలకు ప్రజలకు అందాల్సి ఉండగా... ప్రస్తుతం రూ.45 వేలకు చేరుకుంది. ఆన్​లైన్ విధానంలో ఇసుక లభించకపోవడం వల్ల కొంతమంది నల్లబజారును ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ పాలసీ వల్ల తమకు ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 టన్నుల లారీ రూ.19,500 కు లబ్ధిదారుని ఇంటికి చేరాల్సి ఉండగా... ఇప్పుడు రూ.45 వేలు వెచ్చించినా అందడం లేదు. అదృష్టం కొద్దీ ఆన్​లైన్లో బుక్​ అయినా దాదాపు రూ.12 వేలు మామూళ్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు.

నిల్వకేంద్రాలు లేవు

జిల్లాలో ప్రక్కిలంక, తాళ్లపూడి, వేగేశ్వరపురం, యలమంచిలి లంక, దొడ్డిపట్ల, కరుగోరుమిల్లి, అబ్బిరాజుపాలెం, కొవ్వూరు, వాడపల్లి, ఔరంగబాద్, పదిరిబోలు ప్రాంతాల్లో ఇసుక రీచ్​లు ఏర్పాటు చేశారు. గోదావరి నుంచి తోడుతున్న ఇసుక నిమిషాల్లో అయిపోతోంది. నిల్వకేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా... ‌ఇంకా కార్యారూపం దాల్చలేదు. ఒక్కో రీచ్ నుంచి మూడువందల టన్నుల ఇసుకను విక్రయిస్తున్నారు. ఇంతస్థాయిలో విక్రయించినా.. కొరత ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక కొరతను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. నూతన పాలసీలో మార్పులు తీసుకువచ్చి... ఇసుక విక్రయాల్లో జరుగుతోన్న అక్రమాలను నియంత్రించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:

'ఇక మీ దస్తావేజును మీరే తయారు చేసుకోవచ్చు'

ఇసుక కావాలా... జేబులు గుల్ల కావాల్సిందే...!

రాష్ట్రంలో 3 నెలల పాటు ఇసుక రవాణాపై నిషేధం విధించిన ప్రభుత్వం... నూతన పాలసీని తీసుకొచ్చింది. దీని వల్ల ప్రజల కష్టాలు తీరుతాయని భావించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నూతన విధానం అమలై నెలరోజులు గడుస్తున్నా... ఇసుక నేటికీ సామాన్యునికి అందని ద్రాక్షలానే మారింది. గోదావరి నదికి ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ దుస్థితి నెలకొంది.

దళారుల దందా

జిల్లాలో ఇసుక సరఫరాలో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బల్క్​గా ఇసుకను బుక్​ చేస్తూ నల్లబజారుకు తరలిస్తున్నారు. సర్కారు లెక్కల ప్రకారం 20 టన్నుల ఇసుక రూ.19,500 రూపాయలకు ప్రజలకు అందాల్సి ఉండగా... ప్రస్తుతం రూ.45 వేలకు చేరుకుంది. ఆన్​లైన్ విధానంలో ఇసుక లభించకపోవడం వల్ల కొంతమంది నల్లబజారును ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ పాలసీ వల్ల తమకు ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 టన్నుల లారీ రూ.19,500 కు లబ్ధిదారుని ఇంటికి చేరాల్సి ఉండగా... ఇప్పుడు రూ.45 వేలు వెచ్చించినా అందడం లేదు. అదృష్టం కొద్దీ ఆన్​లైన్లో బుక్​ అయినా దాదాపు రూ.12 వేలు మామూళ్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు.

నిల్వకేంద్రాలు లేవు

జిల్లాలో ప్రక్కిలంక, తాళ్లపూడి, వేగేశ్వరపురం, యలమంచిలి లంక, దొడ్డిపట్ల, కరుగోరుమిల్లి, అబ్బిరాజుపాలెం, కొవ్వూరు, వాడపల్లి, ఔరంగబాద్, పదిరిబోలు ప్రాంతాల్లో ఇసుక రీచ్​లు ఏర్పాటు చేశారు. గోదావరి నుంచి తోడుతున్న ఇసుక నిమిషాల్లో అయిపోతోంది. నిల్వకేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా... ‌ఇంకా కార్యారూపం దాల్చలేదు. ఒక్కో రీచ్ నుంచి మూడువందల టన్నుల ఇసుకను విక్రయిస్తున్నారు. ఇంతస్థాయిలో విక్రయించినా.. కొరత ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక కొరతను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. నూతన పాలసీలో మార్పులు తీసుకువచ్చి... ఇసుక విక్రయాల్లో జరుగుతోన్న అక్రమాలను నియంత్రించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:

'ఇక మీ దస్తావేజును మీరే తయారు చేసుకోవచ్చు'

Intro:గుంటూరు స్కూల్ బస్సు బహుకరణ ఫైలు వచ్చింది దానికి సంబంధించిన విజువల్స్


Body:గుంటూరు స్కూల్ బస్సు బహుకరణ ఫైలు వచ్చింది దానికి సంబంధించిన విజువల్స్


Conclusion:ఆదినారాయణ కాలనీ నుండి చదువుకునే విద్యార్థులు స్కూల్కు వచ్చే మార్గమధ్యంలో రెండు బ్రిడ్జీలు ఉన్నవి బ్రిడ్జి మీద నుండి పిల్లలు నడక సాగిస్తున్నారు ఈ క్రమంలో బ్రిడ్జి మీద వాటర్ ఫుల్లుగా ఉండటం వల్ల పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇది గమనించిన కాలనీవాసులు కోటేశ్వర రావు అనే వ్యక్తి స్కూల్ కి స్కూల్ బస్సును బహూకరించారు ఈ క్రమంలో విద్యార్థులు మాకు చాలా సంతోషకరంగా ఆనందకరంగా ఉంటుందని ఇక నుంచి మాకు ఎటువంటి భయం ఉండదని తెలిపారు గ్రామస్తులు కూడా కోటేశ్వరావు బస్సును బహూకరించిన అందుకు అందరు అభినందించారు అనంతరం ఆయనకు సత్కారాలు కూడా చేశారు
గుంటూరు జిల్లా నుండి సైదాచారి ఈటీవీ న్యూస్ కారంపూడి.9949449423
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.