ETV Bharat / state

చిన్న తిరుపతికి.. కాలినడక వెళ్తోన్న భక్తులపై దూసుకెళ్లిన లారీ - lorry accident at pippara

పశ్చిమ గోదావరి జిల్లా పిప్పర శివారులో భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. వీరవాసరం నుంచి ద్వారకా తిరుమల నడకదారిలో వెళ్తున్న భక్తులను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దారిలోనే ఒక మహిళ మృతి చెందింది.

చిన్న తిరుపతికి కాలినడక వెళ్తోన్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ
author img

By

Published : Sep 26, 2019, 11:27 PM IST

చిన్న తిరుపతికి కాలినడక వెళ్తోన్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ప్రాంతానికి చెందిన సుమారు 45 మంది భక్తులు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు. పిప్పర శివారులో... రహదారి పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న వీరి మీదకు లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. అంబులెన్స్ ఎంతకూ రాని కారణంగా.. క్షతగాత్రులను బొలేరో వాహనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో ఆసుపత్రికి చేరేలోపే దుర్గ (45) అనే మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని భక్తులు రహదారిపై నిలిపి ఆందోళన చేశారు.

చిన్న తిరుపతికి కాలినడక వెళ్తోన్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ప్రాంతానికి చెందిన సుమారు 45 మంది భక్తులు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు. పిప్పర శివారులో... రహదారి పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న వీరి మీదకు లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. అంబులెన్స్ ఎంతకూ రాని కారణంగా.. క్షతగాత్రులను బొలేరో వాహనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో ఆసుపత్రికి చేరేలోపే దుర్గ (45) అనే మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని భక్తులు రహదారిపై నిలిపి ఆందోళన చేశారు.

ఇదీ చదవండి:

గట్టు తగాదాలో నలుగురుకి గాయాలు

Intro:విమాన ప్రదక్షిణం.
గర్బాలయ గోపురమే ఆనంద నిలయ. విమానం వేంకటేశ్వరుడు . స్వామివారి ప్రధానాలయం చుట్టూ 235 అడుగుల పొడవు (తూర్పు నుంచి - పడమరకు), 160 అడుగుల వెడల్పు (దక్షిణం నుంచి ఉత్తరానికి)లు కలిగి దీర్ఘచతురస్రాకారంలో వున్న ప్రదక్షిణ మార్గం. ప్రధాన ఆలయం చుట్టూ వున్న ఈ ప్రదక్షిణమార్గం తూర్పున, పశ్చిమాన సుమారు 15 అడుగుల వెడల్పుతోను, దక్షిణంవైపు సుమారు 30 అడుగుల వెడల్పుతోను , ఉత్తరంవైపున సుమారు 20 అడుగుల వెడల్పుతోను విస్తరించివున్నది. ఆనంద నిలయ విమానానికి ప్రదక్షిణంగా వెళ్లే మార్గం కాబట్టి ఈ మార్గాన్ని 'విమాన ప్రదక్షిణ' మని అంటారు. ఈ గోపురాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. ఆ తర్వాత చాలా మంది పాలకులు పునరుద్దరించారు. సాళువ మంగిదేవుడు కొత్త స్వర్ణ కలశాన్ని ప్రతిష్టించాడు . శ్రీ కృష్ణదేవరాయలు 30 వేల బంగారు వరహాలతో ఆనందనిలయ విమానానికి బంగారుపూత పూయించారట. మహంతుల పాలనలోనూ కొన్ని చేర్పులు జరిగినట్టు ఆధారాలున్నాయి. చివరిసారిగా 1958లో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు కానుకగా సమర్పించిన బంగారంను కరిగించి స్వర్ణ రేకులు సమర్పించారు. ఆలయం లోపల నుంచి విమానమూర్తికి నివేదనలు జరుగుతాయి. ఈ ప్రదక్షిణ మార్గంలో వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాథుడు కనిపిస్తాడు. దక్షిణం నుంచి ప్రదక్షిణగా వెళ్లే వరదరాజస్వామి ఆలయం, బంగారుబావి, అంకురార్పణ మండపం, యాగశాల, సన్నిధి భాష్యకారులు (శ్రీరామానుజుల సన్నిధి ), యోగ నరసింహస్వామి ఆలయం మొదలైన ఉపదేవాలయాలు దర్శనమిస్తాయి . వీటన్నిటినీ కలిపి చుట్టు గుళ్లుగా వ్యవహరిస్తారు.Body:.Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.