ETV Bharat / state

మద్యానికి డబ్బులివ్వలేదని... కడతేర్చాడు! - ప్రగడపల్లిలో భార్యను చంపిన భర్త

11 సంవత్సరాల క్రితం వారిద్దరికీ పెళ్లయ్యింది. వీరి మధ్యలో మద్యం భూతం చిచ్చు పెట్టింది. కట్టుకున్న భార్య కంటే మద్యం మత్తే ఎక్కువనిపించింది. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని తాళికట్టిన భార్య మెడకు సెల్​ ఛార్జర్ వైర్​ను బిగించి హత్య చేశాడు.

husband kills wife with cellphone charger in pragadapalli
భార్యను చంపిన భర్త
author img

By

Published : Jun 1, 2020, 1:16 PM IST

మద్యానికి డబ్బులివ్వలేదని కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లిలో జరిగింది. నిడదవోలు మండలం ఉండ్రాజవరానికి చెందిన సురేష్, ప్రగడపల్లి గ్రామానికి చెందిన నాగ దుర్గాదేవికి 11 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ క్రమంలో నాగ దుర్గాదేవి పుట్టింటికి వచ్చేయటంతో, పెద్దలు రాజీ కుదర్చటంతో ప్రగడపల్లిలో కాపురం పెట్టారు.

మద్యం తాగేందుకు డబ్బులిమ్మని సురేష్ గొడవపడ్డాడు. భార్యను ఎంత అడిగినా డబ్బు ఇవ్వటం లేదనే కోపంతో సెల్​ఛార్జర్​ వైరును నాగ దుర్గాదేవి మెడకు బిగించి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మద్యానికి డబ్బులివ్వలేదని కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లిలో జరిగింది. నిడదవోలు మండలం ఉండ్రాజవరానికి చెందిన సురేష్, ప్రగడపల్లి గ్రామానికి చెందిన నాగ దుర్గాదేవికి 11 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ క్రమంలో నాగ దుర్గాదేవి పుట్టింటికి వచ్చేయటంతో, పెద్దలు రాజీ కుదర్చటంతో ప్రగడపల్లిలో కాపురం పెట్టారు.

మద్యం తాగేందుకు డబ్బులిమ్మని సురేష్ గొడవపడ్డాడు. భార్యను ఎంత అడిగినా డబ్బు ఇవ్వటం లేదనే కోపంతో సెల్​ఛార్జర్​ వైరును నాగ దుర్గాదేవి మెడకు బిగించి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధుల విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.