పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఏకధాటిగా వాన కురిసింది. తాడేపల్లిగూడెం, తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఎండల వల్ల ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు.
ఇదీ చదవండి: