ETV Bharat / state

మూడు నెలలుగా అందని వేతనాలు.. జీతాలు ఇప్పించాలని సిబ్బంది ఆర్జీ - west godavari district latest news

ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు నేడు వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు అందట్లేదని.. తమ గోడు పట్టించుకునే నాధుడే లేడని పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది వాపోతున్నారు.

College staff demands to pay salaries
మూడు నెలలుగా వేతనాలు ఇవ్వట్లే
author img

By

Published : Mar 20, 2021, 5:57 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. ఉన్నత విద్యకు జిల్లాలోనే పేరుగాంచింది. ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. అలాంటి కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలో పనిచేసే సీనియర్ అధ్యాపకుడే.. ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్​గా వ్యవహరించేవారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ కళాశాలకు పూర్తిస్థాయి ప్రిన్సిపాల్ లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణమని సిబ్బంది చెబుతున్నారు.

మూడున్నర నెలలు పూర్తయినా.. తమ గోడు పట్టించుకునే నాథుడే లేడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలని వాళ్లు వాపోయారు. కళాశాల వద్ద ఆందోళన సైతం చేపట్టారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సకాలంలో జీతాలు అందేలా చేయాలని తహసిల్ధార్​కు వినతి పత్రం అందజేశారు. ఈ కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో కలిపి మొత్తం 21 మంది పనిచేస్తున్నామని తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. ఉన్నత విద్యకు జిల్లాలోనే పేరుగాంచింది. ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. అలాంటి కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలో పనిచేసే సీనియర్ అధ్యాపకుడే.. ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్​గా వ్యవహరించేవారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ కళాశాలకు పూర్తిస్థాయి ప్రిన్సిపాల్ లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణమని సిబ్బంది చెబుతున్నారు.

మూడున్నర నెలలు పూర్తయినా.. తమ గోడు పట్టించుకునే నాథుడే లేడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలని వాళ్లు వాపోయారు. కళాశాల వద్ద ఆందోళన సైతం చేపట్టారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సకాలంలో జీతాలు అందేలా చేయాలని తహసిల్ధార్​కు వినతి పత్రం అందజేశారు. ఈ కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో కలిపి మొత్తం 21 మంది పనిచేస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి:

వీరవాసరం పీఎస్​లో నగదు మాయం కేసు: ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.