ELECTRIC BIKE: మరో ఎలక్ట్రిక్ బైక్లో మంటలు చెలరేగాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారి తోట రైల్వేగేట్ సమీపంలో ఓ ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతైంది. భీమవరానికి చెందిన మేడిశెట్టి ఆదినారాయణ ఎలక్ట్రికల్ బైక్పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం ఆగిపోయింది. ఆ తర్వాత పొగలు వచ్చాయి. అప్రమత్తమైన ఆదినారాయణ ద్విచక్రవాహనాన్ని రహదారిపైనే వదిలేసి దూరంగా వెళ్లిపోయారు. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. ఎలక్ట్రికల్ బైక్ మొత్తం కాలి బూడిదైంది.
ఇవీ చదవండి:
- 'ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు'.. వైకాపా ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా.. బీసీలు తెదేపా వెంటే : బుద్ధా వెంకన్న
- Lepakshi: లేపాక్షి అందాలు చూసి తీరాల్సిందే!