పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో సోమవారం ఉదయం జరిగిన బాల్య వివాహం పై ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. వివాహానికి ముందే వరుడు, వధువు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినా.. గుట్టుచప్పుడు కాకుండా వివాహాన్ని జరిపించారని అధికారులు తెలిపారు. వివరాలు సేకరించి లక్కవరం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. బాలికకు 18 సంవత్సరాలు నిండే వరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదని అధికారులు అవగాహన కల్పించారు. బాలికను ఏలూరు శిశు సంక్షేమ సంరక్షణ గృహానికి తరలిస్తామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 52 కిలోల భారీ పనస పండుకు గిన్నిస్ రికార్డు!