ETV Bharat / state

polavaram: పోలవరం పూర్తి చేసేందుకు వందల కోట్లు కావాలి.. కానీ!

author img

By

Published : Jun 6, 2021, 6:59 AM IST

పోలవరం ప్రాజెక్టులో ఇంకా ఎడమ, కుడి కాలువల పనులు, భూసేకరణ మిగిలి ఉండగానే వాటికి నిధులు ఇవ్వబోమని కేంద్రం ఉత్తచేయి చూపుతోంది. పునరావాసానికి, ప్రధాన డ్యాం పనులకు ఇంకా రూ.వేల కోట్లు అవసరమైనా.. అందులో కొంతే ఇస్తామని మొండికేసింది. ఈ ప్రాజెక్టులో ఇంతవరకు 75% పనులు, 50% పైగా భూసేకరణ, పునరావాసం పూర్తయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

పోలవరం పనులు పూర్తి చేసందుకు ఇంకా వందల కోట్లు కావాలి.. కానీ
పోలవరం పనులు పూర్తి చేసందుకు ఇంకా వందల కోట్లు కావాలి.. కానీ

పోలవరం ప్రాజెక్టులో ఇంకా ఎడమ, కుడి కాలువల పనులు, భూ సేకరణ మిగిలి ఉండగానే వాటికి నిధులు ఇవ్వబోమని కేంద్రం ఉత్తచేయి చూపుతోంది. పోలవరం ఎడమ కాలువలో ఇంకా 30% పైగా పనులు చేయాల్సి ఉంది. దాదాపు 5 ప్యాకేజీల్లో పనులు కొత్తవారికి అప్పచెప్పడమో, 60 సి కింద ప్రస్తుత గుత్తేదారుల స్థానంలో కొత్తవారిని నియమించడమో చేయాలి. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తిచేసేందుకు ఇంకా రూ.వందల కోట్లు కావాలి.

కుడి కాలువలోనూ ఇంకా 2% పైగా పనులు చేయాలి. దాదాపు రూ.వంద కోట్ల లోపు అవసరం. ఈ రెండు విభాగాలకు ఇక నిధులిచ్చేది లేదని కేంద్రం తేల్చేసి బిల్లులు వెనక్కి పంపుతోంది. ఇంకా 50వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉండగా రూ.89 కోట్లు మాత్రమే ఈ విభాగంలో ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం మంజూరు చేసిన నిధుల ప్రకారం విశదమవుతోంది. 2013-14 లెక్కల ప్రకారం ఇక రూ.7,054 కోట్లు మాత్రమే ఇస్తామని గత ఏడాది అక్టోబరులో కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2017-18 ధరల ప్రకారం రూ.47,725 కోట్లు ఇవ్వాల్సిందేనని అడుగుతోంది. ఈ లోపు విభాగాల వారీగా లెక్కలు చూస్తూ కాలువలు, తదితర అంశాల్లో నిధులు ఇచ్చేందుకు కేంద్రం అప్పుడే ఉత్తచేయి చూపుతుండటంతో పోలవరం నిధుల సమస్య తీవ్రమైనట్లే.

మేం చేసేదేమీ లేదు

2017-18 ధరలను సాంకేతిక సలహా కమిటీ, అంచనాల సవరణ కమిటీ కూడా ఆమోదించినందున సాంకేతికంగా తాము చేయగలిగింది ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. పోలవరం నిధుల విషయంలో ఇక రాజకీయ నిర్ణయమే కీలకమంటున్నారు. పోలవరానికి 2017-18 ధరల విషయంలో తగిన సమయంలో స్పందిస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఒక ఊరట మాట చెప్పినందున ఇక రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయత్నాలతోనే ఆ నిధులు రాబట్టాలని అధికారులు అంటున్నారు.

తాగునీటి విభాగం ఖర్చు కలిపి లెక్కలు...

కేంద్ర ప్రభుత్వం 2013-14 అంచనాలు మొత్తం రూ.29,027.95 కోట్లకు పరిగణనలోకి తీసుకుని అందులో తాగునీటి విభాగం, విద్యుత్తు విభాగం కింద ఖర్చును తీసివేసి 20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి విభాగాన్ని విడిగా చూడలేమని పోలవరం అథారిటీ సమావేశంలోనూ వాదించింది. ఆ విభాగం కింద ఖర్చును, విద్యుత్కేంద్రంలో పునాదులుగా తవ్వే మట్టిని ప్రధాన డ్యాంలో వినియోగించుకుంటున్నందున ఆ మొత్తం కలిపి రూ.25,390.61 కోట్లుగా లెక్కించి విభాగాల వారీగా పరిశీలిస్తే పై లెక్కలు తేలాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇక వచ్చేది స్వల్పమే.

  • పోలవరం ప్రాజెక్టులో ఇంకా 45.72 మీటర్ల స్థాయికి 50 వేల ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది.
  • లక్ష మందిని పైగా పునరావాసానికి తరలించాల్సి ఉంది
  • పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఇంతవరకు రూ.12,641 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం రూ.10,741.50 కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది.

ఇదీ చదవండి:

పది పరీక్షలా? ఇంటరా?

పోలవరం ప్రాజెక్టులో ఇంకా ఎడమ, కుడి కాలువల పనులు, భూ సేకరణ మిగిలి ఉండగానే వాటికి నిధులు ఇవ్వబోమని కేంద్రం ఉత్తచేయి చూపుతోంది. పోలవరం ఎడమ కాలువలో ఇంకా 30% పైగా పనులు చేయాల్సి ఉంది. దాదాపు 5 ప్యాకేజీల్లో పనులు కొత్తవారికి అప్పచెప్పడమో, 60 సి కింద ప్రస్తుత గుత్తేదారుల స్థానంలో కొత్తవారిని నియమించడమో చేయాలి. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తిచేసేందుకు ఇంకా రూ.వందల కోట్లు కావాలి.

కుడి కాలువలోనూ ఇంకా 2% పైగా పనులు చేయాలి. దాదాపు రూ.వంద కోట్ల లోపు అవసరం. ఈ రెండు విభాగాలకు ఇక నిధులిచ్చేది లేదని కేంద్రం తేల్చేసి బిల్లులు వెనక్కి పంపుతోంది. ఇంకా 50వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉండగా రూ.89 కోట్లు మాత్రమే ఈ విభాగంలో ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం మంజూరు చేసిన నిధుల ప్రకారం విశదమవుతోంది. 2013-14 లెక్కల ప్రకారం ఇక రూ.7,054 కోట్లు మాత్రమే ఇస్తామని గత ఏడాది అక్టోబరులో కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2017-18 ధరల ప్రకారం రూ.47,725 కోట్లు ఇవ్వాల్సిందేనని అడుగుతోంది. ఈ లోపు విభాగాల వారీగా లెక్కలు చూస్తూ కాలువలు, తదితర అంశాల్లో నిధులు ఇచ్చేందుకు కేంద్రం అప్పుడే ఉత్తచేయి చూపుతుండటంతో పోలవరం నిధుల సమస్య తీవ్రమైనట్లే.

మేం చేసేదేమీ లేదు

2017-18 ధరలను సాంకేతిక సలహా కమిటీ, అంచనాల సవరణ కమిటీ కూడా ఆమోదించినందున సాంకేతికంగా తాము చేయగలిగింది ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. పోలవరం నిధుల విషయంలో ఇక రాజకీయ నిర్ణయమే కీలకమంటున్నారు. పోలవరానికి 2017-18 ధరల విషయంలో తగిన సమయంలో స్పందిస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఒక ఊరట మాట చెప్పినందున ఇక రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయత్నాలతోనే ఆ నిధులు రాబట్టాలని అధికారులు అంటున్నారు.

తాగునీటి విభాగం ఖర్చు కలిపి లెక్కలు...

కేంద్ర ప్రభుత్వం 2013-14 అంచనాలు మొత్తం రూ.29,027.95 కోట్లకు పరిగణనలోకి తీసుకుని అందులో తాగునీటి విభాగం, విద్యుత్తు విభాగం కింద ఖర్చును తీసివేసి 20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి విభాగాన్ని విడిగా చూడలేమని పోలవరం అథారిటీ సమావేశంలోనూ వాదించింది. ఆ విభాగం కింద ఖర్చును, విద్యుత్కేంద్రంలో పునాదులుగా తవ్వే మట్టిని ప్రధాన డ్యాంలో వినియోగించుకుంటున్నందున ఆ మొత్తం కలిపి రూ.25,390.61 కోట్లుగా లెక్కించి విభాగాల వారీగా పరిశీలిస్తే పై లెక్కలు తేలాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇక వచ్చేది స్వల్పమే.

  • పోలవరం ప్రాజెక్టులో ఇంకా 45.72 మీటర్ల స్థాయికి 50 వేల ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది.
  • లక్ష మందిని పైగా పునరావాసానికి తరలించాల్సి ఉంది
  • పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఇంతవరకు రూ.12,641 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం రూ.10,741.50 కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది.

ఇదీ చదవండి:

పది పరీక్షలా? ఇంటరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.