ETV Bharat / state

మూడో విడత సాయంగా రైతుల ఖాతాల్లో నగదు జమ

author img

By

Published : Dec 29, 2020, 3:45 PM IST

Updated : Dec 29, 2020, 4:39 PM IST

గత నెలలో నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు రైతు భరోసా కింద ప్రభుత్వం సాయమందిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని రైతుల ఖాతాల్లో మూడో విడత సాయంగా నగదు జమ అయ్యింది.

raithu barosa scheme
రైతు భరోసా కింద ప్రభుత్వ సాయం

పశ్చిమగోదావరి జిల్లాలో నివర్ తుపాన్​ కారణంగా 22,062 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. పంట నష్టపోయిన 45 వేల 105 మంది రైతులకు 33 కోట్ల 30 లక్షల రూపాయల పెట్టుబడి రాయితీ వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు గౌసియా బేగం తెలిపారు.

మూడో విడత సాయంగా జిల్లాలోని 3,44,789 మంది రైతులకు 70 కోట్ల 55 లక్షలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 25న పరిహారం అందని వారికి నేడు జమ అవుతాయని జేడీఏ చెప్పారు. గతంలో రైతు భరోసా మంజూరు కాని రైతులు గ్రీవెన్స్​లో దరఖాస్తు చేసుకున్నారని.. వారిలో 2,112 మందికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల చొప్పున ఖాతాలో జమ చేస్తున్నామని వెల్లడించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో నివర్ తుపాన్​ కారణంగా 22,062 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. పంట నష్టపోయిన 45 వేల 105 మంది రైతులకు 33 కోట్ల 30 లక్షల రూపాయల పెట్టుబడి రాయితీ వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు గౌసియా బేగం తెలిపారు.

మూడో విడత సాయంగా జిల్లాలోని 3,44,789 మంది రైతులకు 70 కోట్ల 55 లక్షలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 25న పరిహారం అందని వారికి నేడు జమ అవుతాయని జేడీఏ చెప్పారు. గతంలో రైతు భరోసా మంజూరు కాని రైతులు గ్రీవెన్స్​లో దరఖాస్తు చేసుకున్నారని.. వారిలో 2,112 మందికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల చొప్పున ఖాతాలో జమ చేస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని

Last Updated : Dec 29, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.