తరచూ ఏలూరు కలెక్టర్లో నిర్వహించే సమావేశాలకు హాజరై తిరిగి రావడానికి తాను భయపడుతున్నానని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. మోషేన్రాజుకు ఆరోగ్యం సహకరించకపోయినా.. ఈ రోడ్లపై తిరుగుతూ ఎంతోమందిని కలవడాన్ని కొనియాడారు. రోడ్ల దుస్థితిపై అధికార పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు ఎమ్మెల్యే మాటలకు నివ్వెరపోయారు. ఏదేమైనా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై ఎమ్మెల్యే మాట్లాడడాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు.
ఇదీ చదవండి: