పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో పంచాయతీ రెండోదశ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభమైంది. 13 మండలాల్లో 195 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా మండలాల్లోని ప్రతి మండల కార్యాలయం వద్ద సమీప పాఠశాలల్లో సామగ్రి పంపిణీ ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారులు.. పంచాయతీ వార్డులు వారిగా పోలింగ్ సజావుగా సాగడానికి, పోలింగ్ వివరాలు నమోదు చేయడానికి అవసరమైన పత్రాలను, బ్యాలెట్ బాక్సులను సిబ్బందికి అందజేశారు.
నిర్దేశించిన మార్గాల్లో పోలింగ్ కేంద్రాలకు సామగ్రి...
సిబ్బందికి అప్పగించిన సామగ్రిని పరిశీలించుకున్న అనంతరం పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. పోలింగ్ కేంద్రాలను దృష్టిలో వుంచుకొని.. వారు ప్రయాణించే దారులను ఏర్పాటు చేశారు. రూట్ల వారీగా బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఇవీ చూడండి...