ETV Bharat / state

కనిపించకుండా పోయాడు...కాలువలో శవమై తేలాడు - విజయనగరం జిల్ల వార్తలు

మూడు రోజుల కిందట కనిపించకుండా పోయిన బాలుడు... కాలువలో శవమై కనిపించిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటుచేసుకుంది.

The boy drowned in a ditch at paravathipuram
కాలువలో మునిగి బాలుడు మృతి
author img

By

Published : Aug 28, 2020, 10:14 AM IST



విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలోని కొత్తవలస నందమూరి కాలనీకి చెందిన కె.సాయి కుమార్(13) కాలువలో మునిగి మృతి చెందాడు. సాయి కుమార్ మూడు రోజుల కిందట గుడ్ల కోసం పాఠశాలకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి చేరలేదు. కుటుంబీకులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కళాధర్ తెలిపారు.

మూడో రోజు కొత్తవలస శివారులోని జంఝావతి కాలువలో బాలుడి మృతదేహం గుర్తించిన స్థానికులు... సమాచారం అందించారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.



విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలోని కొత్తవలస నందమూరి కాలనీకి చెందిన కె.సాయి కుమార్(13) కాలువలో మునిగి మృతి చెందాడు. సాయి కుమార్ మూడు రోజుల కిందట గుడ్ల కోసం పాఠశాలకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి చేరలేదు. కుటుంబీకులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కళాధర్ తెలిపారు.

మూడో రోజు కొత్తవలస శివారులోని జంఝావతి కాలువలో బాలుడి మృతదేహం గుర్తించిన స్థానికులు... సమాచారం అందించారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


ఇదీ చదవండి: కరోనా పేరుతో మోసం.. ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.