అమరావతినే రాజధానిగా కొనసాగించాలని... విజయనగరంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు అశోక్గజపతి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడారు. రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. శ్రీనగర్లో ఉన్న పరిస్థితిని రాష్ట్రంలోకి తీసుకురావటం అన్యాయమని విమర్శించారు. పోలవరం ఆపేసి విశాఖకు నీరు తీసుకువస్తాననటం సాధ్యమేనా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఎరుపెక్కిన విజయనగరంజిల్లా రహదారులు