ETV Bharat / state

'సీఎం గారూ.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి' - ఈరోజు సాక్షర భారత్ సమన్వయ కర్తలు ఆందోళన వార్తలు

వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. తమను పట్టించుకోలేదని సాక్షర భారత్ సమన్వయ కర్తలు వాపోయారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి.. అనంతరం కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు.

sakshara bharat Coordinators
సాక్షర భారత్ సమన్వయ కర్తలు ధర్నా
author img

By

Published : Mar 22, 2021, 8:44 PM IST

పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని విజయనగరం జిల్లాలో సాక్షర భారత్ సమన్వయ కర్తలు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం 2010 నుంచి తాము ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. రాత్రి బడులు నిర్వహించటంతో పాటు.. గ్రామంలో ప్రజలకు.. వీఆర్ఓ అందించే అన్ని సేవలను అందించామన్నారు. ఉన్నఫలంగా తమను ఉద్యోగాల నుంచి తొలగించటంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని వాపోయారు.

పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని విజయనగరం జిల్లాలో సాక్షర భారత్ సమన్వయ కర్తలు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం 2010 నుంచి తాము ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. రాత్రి బడులు నిర్వహించటంతో పాటు.. గ్రామంలో ప్రజలకు.. వీఆర్ఓ అందించే అన్ని సేవలను అందించామన్నారు. ఉన్నఫలంగా తమను ఉద్యోగాల నుంచి తొలగించటంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని వాపోయారు.

ఇవీ చూడండి:

రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.