ETV Bharat / state

ఆటోను ఢీ కొట్టిన బొలేరో... తొమ్మిది మందికి గాయాలు

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ సమీపంలోని సుంకి గ్రామం వద్ద ఆటోను బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పార్వతీపురం మండలం కృష్ణపల్లికి చెందిన వీరంతా.. గరుగుబిల్లి మండలం రావివలసకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరింగింది. చికిత్స కోసం పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి క్షతగాత్రులను తరలించారు.

road accident at vizianagaram nine members injured
ఆటోను ఢీకొన్న బొలెరో తొమ్మిది మందికి గాయాలు
author img

By

Published : Dec 26, 2020, 5:23 PM IST

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ సమీపంలోని సుంకి గ్రామం మూల మలుపు వద్ద ఆటోను బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీళ్లంతా పార్వతీపురం మండలం కృష్ణపల్లికి చెందినవారు. గరుగుబిల్లి మండలం రావివలసలో ఇటీవల బంధువు చనిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆటోలో బయలుదేరి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

క్షతగాత్రులను 108 వాహనాలు, ఆటోల్లో పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్యపరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ సమీపంలోని సుంకి గ్రామం మూల మలుపు వద్ద ఆటోను బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీళ్లంతా పార్వతీపురం మండలం కృష్ణపల్లికి చెందినవారు. గరుగుబిల్లి మండలం రావివలసలో ఇటీవల బంధువు చనిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆటోలో బయలుదేరి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

క్షతగాత్రులను 108 వాహనాలు, ఆటోల్లో పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్యపరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.