ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా వర్షాలు.. జలమయమైన రహదారులు - ఈరోజు విజయనగరం వ్యాప్తంగా వర్షాలు వార్తలు

కొన్నాళ్లుగా ఎండ వేడిమికి విలవిల్లాడిన విజయనగరం జిల్లా ప్రజలు.. ఏకధాటిగా కురిసిన వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి.

rains in vzm
విజయనగరం వ్యాప్తంగా వర్షాలు
author img

By

Published : May 23, 2021, 11:50 AM IST

విజయనగరం వ్యాప్తంగా వర్షాలు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా.. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి... తెర్లాం, గరుగుబిల్లి, దత్తిరాజేరు, బాడంగి, రామభద్రపురం, నెల్లిమర్ల, విజయనగరంలో ఆర్.టి.సీ కాంప్లెక్స్, పాల్ నగర్, తోటపాలెం ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.

జిల్లా కేంద్రంలో సుమారు గంట పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. బొబ్బిలి మండలం చింతాడలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను బొబ్బిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నెల్లిమర్ల మండలం సతివాడలో పిడుగు పడి గొర్రెల కాపరి మృతి చెందాడు.

ఇవీ చూడండి:

బొబ్బిలి చింతాడలో పిడుగుపాటు.. ముగ్గురు మృతి

విజయనగరం వ్యాప్తంగా వర్షాలు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా.. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి... తెర్లాం, గరుగుబిల్లి, దత్తిరాజేరు, బాడంగి, రామభద్రపురం, నెల్లిమర్ల, విజయనగరంలో ఆర్.టి.సీ కాంప్లెక్స్, పాల్ నగర్, తోటపాలెం ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.

జిల్లా కేంద్రంలో సుమారు గంట పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. బొబ్బిలి మండలం చింతాడలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను బొబ్బిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నెల్లిమర్ల మండలం సతివాడలో పిడుగు పడి గొర్రెల కాపరి మృతి చెందాడు.

ఇవీ చూడండి:

బొబ్బిలి చింతాడలో పిడుగుపాటు.. ముగ్గురు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.