ETV Bharat / state

విజయనగరంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు

author img

By

Published : Mar 10, 2021, 10:03 AM IST

Updated : Mar 10, 2021, 5:12 PM IST

విజయనగరం జిల్లా వ్యాప్తంగా 4 మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థలో ఎన్నికలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. తమ ఓటును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు.

peacefull polling in Vijayanagar district
విజయనగరంలో ప్రశాంతంగా పోలింగ్

జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కార్పొరేషన్​తో పాటు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగరపంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 160 వార్డులు ఉండగా.. పార్వతీపురంలో ఆరు, బొబ్బిలిలో ఒక వార్డు ఏకగ్రీవమైంది. విజయనగరం ఐదో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మృతితో పోలింగ్ ఈ నెల 12కి వాయిదా వేశారు. మిగిలిన 152 వార్డుల్లో 473 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా.. 371 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

సాలూరులో ప్రశాంతంగా పోలింగ్

ఉదయం 11 గంటలకు 35% పోలింగ్..

బొబ్బిలి పురపాలన సంఘం ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఓటర్లు పోటెత్తారు. ఉదయం 11 గంటలకు 35% పోలింగ్ నమోదైంది. వృద్ధులు, దివ్యాంగులు సైతం కుటుంబ సభ్యులు సహాయంతో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓట్లు వేశారు. పాత బొబ్బిలి, గొల్లపల్లి, మల్లంపేట ప్రాంతాల్లో ఓటర్లు బారులుతీరారు. కరోనా నిబంధనలు పాటించకుండా జనం గుమిగూడటంతో ఓటు వేసేందుకు కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ ఆధ్వర్యంలో బృందాలు పర్యటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్..

మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం కార్పొరేషన్ పరిధి కణపాక యూత్ హాస్టల్ లోని పోలింగ్ కేంద్రం ఐదో బూత్​లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లు స్వేచ్చాయుతంగా ఓటింగ్​లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించేందుకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ హరి జవహర్ లాల్

ఓటు వేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు..

కేంద్ర మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్ పరిధి 39వ డివిజన్ సాలిపేటలోని గురజాడ పాఠశాల పోలింగ్ కేంద్రంలో అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. సాధారణ ఓటరులా.. వరుసలో నిలబడి.. ఓటు వేయటం అందరిని ఆకట్టుకుంది. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవచ్చని.. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాలని అశోక్ గజపతిరాజు కోరారు.

ఓటు వేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోలగట్ల..

నగరపాలక ఎన్నికల్లో భాగంగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఓటు వేశారు. 31వ డివిజన్ జొన్నగుడ్డి ప్రాథమిక పాఠశాల పొలింగ్ సెంటర్​లో.. సతీమణితో పాటు కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సాలూరులో పోలింగ్..

సాలూరు పురపాలక సంఘ ఎన్నికలుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు.

ఓటు వినియోగించుకుంటున్న వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర..

సాలూరు పట్టణ పురపాలక ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 29 వార్డులకు గాను 28 చోట్ల పోటీ చేస్తున్న తమ అభ్యర్థుల్లో 23 మంది గెలుస్తారని నమ్మకంగా ఉందని రాజన్నదొర పేర్కొన్నారు.

ఓటు వినియోగించుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర

ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి..

తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కారణంగా ఈ సారి 16 సీట్లు వరకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అన్నారు. సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ తెదేపాకే దక్కుతుందని నమ్మకంగా చెబుతున్నానని పేర్కొన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి

బొబ్బిలిలో పోలింగ్..

బొబ్బిలిలో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను.. పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక తాండ్రపాపయ పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి సుజాయ్ కృష్ణ రంగారావు, బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జి బేబీ నాయనా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారి పార్టీ ఓటర్లలను భయ పెట్టినప్పటికి వారంతా తెదేపా పక్షాన ఉన్నారన్నారు. బొబ్బిలిలో తెదేపా జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బొబ్బిలిలో ఓటు వేసిన మాజీ మంత్రి సుజాయ్ కృష్ణ రంగారావు

పోలింగ్ కేంద్రం పరిశీలన...

బొబ్బిలి పురపోరు ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్దకు ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్ దండే ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో ఎన్నికలు జరుగు ప్రక్రియను పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈయనతో పాటు జాయింట్ కలెక్టర్ వెంకటరావు, సబ్ కలెక్టర్ విధేఖర్ హాజరయ్యారు.

పోలింగ్ కేంద్రం పరిశీలన

పార్వతీపురంలో పోలింగ్..

పుర ఎన్నిక పోలింగ్ పార్వతీపురంలో.. 30 వార్డులు గాను ఆరు ఏకగ్రీవం కాగా.. 24 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అన్నిచోట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఇవీ చూడండి: 'నాపై అశోక్ గజపతిరాజు చేయి చేసుకోలేదు'

జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కార్పొరేషన్​తో పాటు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగరపంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 160 వార్డులు ఉండగా.. పార్వతీపురంలో ఆరు, బొబ్బిలిలో ఒక వార్డు ఏకగ్రీవమైంది. విజయనగరం ఐదో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మృతితో పోలింగ్ ఈ నెల 12కి వాయిదా వేశారు. మిగిలిన 152 వార్డుల్లో 473 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా.. 371 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

సాలూరులో ప్రశాంతంగా పోలింగ్

ఉదయం 11 గంటలకు 35% పోలింగ్..

బొబ్బిలి పురపాలన సంఘం ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఓటర్లు పోటెత్తారు. ఉదయం 11 గంటలకు 35% పోలింగ్ నమోదైంది. వృద్ధులు, దివ్యాంగులు సైతం కుటుంబ సభ్యులు సహాయంతో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓట్లు వేశారు. పాత బొబ్బిలి, గొల్లపల్లి, మల్లంపేట ప్రాంతాల్లో ఓటర్లు బారులుతీరారు. కరోనా నిబంధనలు పాటించకుండా జనం గుమిగూడటంతో ఓటు వేసేందుకు కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ ఆధ్వర్యంలో బృందాలు పర్యటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్..

మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం కార్పొరేషన్ పరిధి కణపాక యూత్ హాస్టల్ లోని పోలింగ్ కేంద్రం ఐదో బూత్​లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లు స్వేచ్చాయుతంగా ఓటింగ్​లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించేందుకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ హరి జవహర్ లాల్

ఓటు వేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు..

కేంద్ర మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్ పరిధి 39వ డివిజన్ సాలిపేటలోని గురజాడ పాఠశాల పోలింగ్ కేంద్రంలో అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. సాధారణ ఓటరులా.. వరుసలో నిలబడి.. ఓటు వేయటం అందరిని ఆకట్టుకుంది. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవచ్చని.. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాలని అశోక్ గజపతిరాజు కోరారు.

ఓటు వేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోలగట్ల..

నగరపాలక ఎన్నికల్లో భాగంగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఓటు వేశారు. 31వ డివిజన్ జొన్నగుడ్డి ప్రాథమిక పాఠశాల పొలింగ్ సెంటర్​లో.. సతీమణితో పాటు కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సాలూరులో పోలింగ్..

సాలూరు పురపాలక సంఘ ఎన్నికలుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు.

ఓటు వినియోగించుకుంటున్న వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర..

సాలూరు పట్టణ పురపాలక ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 29 వార్డులకు గాను 28 చోట్ల పోటీ చేస్తున్న తమ అభ్యర్థుల్లో 23 మంది గెలుస్తారని నమ్మకంగా ఉందని రాజన్నదొర పేర్కొన్నారు.

ఓటు వినియోగించుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర

ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి..

తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కారణంగా ఈ సారి 16 సీట్లు వరకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అన్నారు. సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ తెదేపాకే దక్కుతుందని నమ్మకంగా చెబుతున్నానని పేర్కొన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి

బొబ్బిలిలో పోలింగ్..

బొబ్బిలిలో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను.. పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక తాండ్రపాపయ పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి సుజాయ్ కృష్ణ రంగారావు, బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జి బేబీ నాయనా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారి పార్టీ ఓటర్లలను భయ పెట్టినప్పటికి వారంతా తెదేపా పక్షాన ఉన్నారన్నారు. బొబ్బిలిలో తెదేపా జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బొబ్బిలిలో ఓటు వేసిన మాజీ మంత్రి సుజాయ్ కృష్ణ రంగారావు

పోలింగ్ కేంద్రం పరిశీలన...

బొబ్బిలి పురపోరు ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్దకు ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్ దండే ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో ఎన్నికలు జరుగు ప్రక్రియను పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈయనతో పాటు జాయింట్ కలెక్టర్ వెంకటరావు, సబ్ కలెక్టర్ విధేఖర్ హాజరయ్యారు.

పోలింగ్ కేంద్రం పరిశీలన

పార్వతీపురంలో పోలింగ్..

పుర ఎన్నిక పోలింగ్ పార్వతీపురంలో.. 30 వార్డులు గాను ఆరు ఏకగ్రీవం కాగా.. 24 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అన్నిచోట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఇవీ చూడండి: 'నాపై అశోక్ గజపతిరాజు చేయి చేసుకోలేదు'

Last Updated : Mar 10, 2021, 5:12 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.