ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రైతులకు.. అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీ మిషన్ పనులు చేపట్టింది. భవనం నిర్మించినప్పటికీ.. అది రైతులకు అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై అధికారులను సంప్రదించగా... సిబ్బంది కొరతతో టెక్నాలజీ సేవలు కష్టంగా ఉందని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా భవనాన్ని ప్రారంభించాలని జనపనార సాగుదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి