ETV Bharat / state

బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన

author img

By

Published : Mar 15, 2021, 4:51 PM IST

దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవటంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. విజయనగరంలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అనంతరం గంటస్తంభం వద్ద మానవహారం నిర్వహించారు.

Government bank employees rally
ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. యూఎఫ్​బీయూ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె చేపట్టారు. సమ్మెల్లో భాగంగా మొదటి రోజు నిరసన ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఎస్బీఐ ప్రధాన శాఖ కోట జక్షన్​ నుంచి మూడు లాంతర్లు, పెద్దమార్కెట్ మీదుగా గంటస్తంభం వరకు ర్యాలీ సాగింది. అనంతరం గంటస్తంభం వద్ద మానవహారం నిర్వహించారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే.. ఉద్యోగులకే కాకుండా ఖాతాదారులకు పలు ఇబ్బందులు తప్పవన్నారు. కనీస ఖాతా నిల్వలు పెంచటమే కాకుండా... డిపాజిట్ల వడ్డీ రేట్లు తగ్గి, రుణాలపై పెద్ద మొత్తంలో వడ్డీల భారం పెరగనుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. యూఎఫ్​బీయూ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె చేపట్టారు. సమ్మెల్లో భాగంగా మొదటి రోజు నిరసన ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఎస్బీఐ ప్రధాన శాఖ కోట జక్షన్​ నుంచి మూడు లాంతర్లు, పెద్దమార్కెట్ మీదుగా గంటస్తంభం వరకు ర్యాలీ సాగింది. అనంతరం గంటస్తంభం వద్ద మానవహారం నిర్వహించారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే.. ఉద్యోగులకే కాకుండా ఖాతాదారులకు పలు ఇబ్బందులు తప్పవన్నారు. కనీస ఖాతా నిల్వలు పెంచటమే కాకుండా... డిపాజిట్ల వడ్డీ రేట్లు తగ్గి, రుణాలపై పెద్ద మొత్తంలో వడ్డీల భారం పెరగనుందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

చీపురుపల్లిలో భక్తజన సందోహంగా ప్రభల సంబరం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.