ETV Bharat / state

కొండవానిపాలెంలో అగ్ని ప్రమాదం.. 40పూరిళ్లు దగ్ధం

author img

By

Published : Mar 6, 2021, 10:56 AM IST

వారంత నిరుపేదలు. కూలికెళ్తె గానీ రోజు గడవదు. అటవీ ఉత్పత్తులు, పోడు వ్యవసాయమే వారికి జీవనాధారం. అలాంటి వారి ఆవాసాలను అగ్గి.. బుగ్గిపాలు చేసింది. పనికి వెళ్లొచ్చే లోపే దావనంలా వ్యాపించి గ్రామాన్ని రావణకాష్ఠలా మార్చింది. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

fire accident
కొండవానిపాలెంలో అగ్ని ప్రమాదం.. 40పూరిళ్లు దగ్ధం

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండవానిపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 40పూరిళ్లు దగ్ధమవ్వగా... 25లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం సంభవించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

మొదట ఓ ఇంట్లో ప్రారంభమైన మంటలు క్రమేపి ఊరంతా వ్యాపించాయి. ఉదయమే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ పనుల కోసం వెళ్లిన గ్రామస్థులు సాయంత్రం వచ్చే లోపు ఇళ్లన్నీ కాలి బూడిదపాలయ్యాయి. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండవానిపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 40పూరిళ్లు దగ్ధమవ్వగా... 25లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం సంభవించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

మొదట ఓ ఇంట్లో ప్రారంభమైన మంటలు క్రమేపి ఊరంతా వ్యాపించాయి. ఉదయమే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ పనుల కోసం వెళ్లిన గ్రామస్థులు సాయంత్రం వచ్చే లోపు ఇళ్లన్నీ కాలి బూడిదపాలయ్యాయి. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి: చెరకు లారీ బోల్తా .. రాకపోకలకు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.