ETV Bharat / state

ఎస్​పీసీ దత్తత పాఠశాలలకు సామగ్రి అందచేసిన ఎస్పీ - విజయనగరంలో పాఠశాలలో సామగ్రి అందజేత

విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, పోలీసులదే అని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. ఎస్​పీసీ( స్టూడెంట్ పోలీస్ క్యాడెట్) వ్యవస్థ కింద దత్తత తీసుకున్న పాఠశాలలకు సామగ్రిని అందజేశారు.

equipments distributed in vizianagaram schools under spc program
పాఠశాలలకు సామగ్రి అందజేత
author img

By

Published : Jul 23, 2020, 9:28 PM IST

విజయనగరం జిల్లాలో పోలీసు శాఖ దత్తత తీసుకున్న పాఠశాలలకు అవసరమైన సామగ్రిని జిల్లా ఎస్పీ బీ.రాజకుమారి అందించారు. స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ వ్యవస్థ కింద కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు, ప్రింటర్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, స్కానర్లు, కుర్చీలు, పెన్​డ్రైవ్​లు మొదలగు పరికరాలను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో ఎస్​పీసీ అనేది ఒక పవిత్రమైన కార్యం అన్నారు. విద్యతో సంస్కారవంతులుగాను, మానవతా విలువలు కలిగిన వ్యక్తులుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఉద్ఘాటించారు. వక్రమార్గం పడుతున్న టీనేజీ విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్​పీసీ పాఠశాలలను సంబంధిత ఎస్​ఐ వారంలో ఒకసారి సందర్శించి విద్యార్థులతో మమేకమవుతారని ఎస్పీ చెప్పారు. దీని వల్ల పిల్లలు చెడు స్నేహాలు పట్టకుండా ఉంటారన్నారు. టెక్నాలజీని మంచి పనులకు వినియోగిస్తే విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, పోలీసులదే అని ఉద్ఘాటించారు.

విజయనగరం జిల్లాలో పోలీసు శాఖ దత్తత తీసుకున్న పాఠశాలలకు అవసరమైన సామగ్రిని జిల్లా ఎస్పీ బీ.రాజకుమారి అందించారు. స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ వ్యవస్థ కింద కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు, ప్రింటర్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, స్కానర్లు, కుర్చీలు, పెన్​డ్రైవ్​లు మొదలగు పరికరాలను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో ఎస్​పీసీ అనేది ఒక పవిత్రమైన కార్యం అన్నారు. విద్యతో సంస్కారవంతులుగాను, మానవతా విలువలు కలిగిన వ్యక్తులుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఉద్ఘాటించారు. వక్రమార్గం పడుతున్న టీనేజీ విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్​పీసీ పాఠశాలలను సంబంధిత ఎస్​ఐ వారంలో ఒకసారి సందర్శించి విద్యార్థులతో మమేకమవుతారని ఎస్పీ చెప్పారు. దీని వల్ల పిల్లలు చెడు స్నేహాలు పట్టకుండా ఉంటారన్నారు. టెక్నాలజీని మంచి పనులకు వినియోగిస్తే విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, పోలీసులదే అని ఉద్ఘాటించారు.

ఇవీ చదవండి...

కాసేపట్లో పెళ్లి... ఇంతలో 'పాజిటివ్' అంటూ సందేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.