ETV Bharat / state

కురుకుట్టిలో ఎన్నికల ప్రచారం.. ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్యం - కురుకుట్టిలో ఎన్నికల ప్రచారానికి గిరిజనులతో ధింసా నృత్యం

విజయనగరం జిల్లా సాలూరు మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కురుకుట్టిలో ఎన్నికల ప్రచారానికి గిరిజనులతో థింసా నృత్యం చేస్తూ... అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారు.

Election campaign
ధింసా నృత్యం
author img

By

Published : Feb 11, 2021, 7:03 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టిలో వైకాపాకు చెందిన ఇద్దరు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగారు. గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న దొరలతాడివలస వరకు అభ్యర్థులిద్దరూ భారీ ర్యాలీ నిర్వహించారు. తమకే ఓటు వేయాలని ప్రజలను వేడుకున్నారు.

ఈ ప్రచారంలో గిరిజన మహిళలు చేసిన థింసా నృత్యం ఆకట్టుకుంది. మేళతాళాలతో కూడిన నృత్యం ప్రచారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే రోజు ఇద్దరు అభ్యర్థులు ప్రచారం నిర్వహించిన కారణంగా... గ్రామంలో సందడి నెలకొంది. ఇరువురి ర్యాలీలు ఎదురుపడ్డాయి.

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టిలో వైకాపాకు చెందిన ఇద్దరు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగారు. గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న దొరలతాడివలస వరకు అభ్యర్థులిద్దరూ భారీ ర్యాలీ నిర్వహించారు. తమకే ఓటు వేయాలని ప్రజలను వేడుకున్నారు.

ఈ ప్రచారంలో గిరిజన మహిళలు చేసిన థింసా నృత్యం ఆకట్టుకుంది. మేళతాళాలతో కూడిన నృత్యం ప్రచారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే రోజు ఇద్దరు అభ్యర్థులు ప్రచారం నిర్వహించిన కారణంగా... గ్రామంలో సందడి నెలకొంది. ఇరువురి ర్యాలీలు ఎదురుపడ్డాయి.

ఇదీ చదవండి:

ధనిక పంచాయతీల్లో పాగా వేసేందుకు.. అభ్యర్థుల కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.