ETV Bharat / state

25 నుంచి శంబర పోలమాంబ జాతర

author img

By

Published : Jan 21, 2021, 10:02 AM IST

విజయనగరంలో శంబర పోలమాంబ జాతరను ... ప్రజలు ఇళ్ల వద్దనే జరుపుకొవాలని డీఎస్పీ సుభాష్ తెలిపారు. బంధువులను పిలవకుండా కుటుంబ సభ్యులతో చేసుకొవాలని సూచించారు.

DSP press conference
విజయనగరం శంబర పోలమాంబ జాతరపై డీఎస్పీ పత్రికా సమావేశం

విజయనగరం జిల్లా మక్కువ మండలంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో శంబర పోలమాంబ జాతర జరగనుంది. ఈ జాతరను ప్రజలు ఇళ్ల వద్దనే నిర్వహించుకుని.. పూజలు చేసుకోవాలని డీఎస్పీ సుభాష్ విజ్ఞప్తి చేశారు. వేడుకల నిర్వహణపై సాలూరు సర్కిల్ ఇన్​స్పెక్టర్ అప్పలనాయుడు, సబ్ ఇన్​స్పెక్టర్​తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు.

బయటి నుంచి వచ్చే వారు ఎవరైనా ఉంటే భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి... గ్రామస్థులు బంధువులను పిలవకుండా కుటుంబ సభ్యులతో పూజలు చేసుకోవాలని సూచించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ.. వేడుక చేసుకోవాలని.. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

విజయనగరం జిల్లా మక్కువ మండలంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో శంబర పోలమాంబ జాతర జరగనుంది. ఈ జాతరను ప్రజలు ఇళ్ల వద్దనే నిర్వహించుకుని.. పూజలు చేసుకోవాలని డీఎస్పీ సుభాష్ విజ్ఞప్తి చేశారు. వేడుకల నిర్వహణపై సాలూరు సర్కిల్ ఇన్​స్పెక్టర్ అప్పలనాయుడు, సబ్ ఇన్​స్పెక్టర్​తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు.

బయటి నుంచి వచ్చే వారు ఎవరైనా ఉంటే భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి... గ్రామస్థులు బంధువులను పిలవకుండా కుటుంబ సభ్యులతో పూజలు చేసుకోవాలని సూచించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ.. వేడుక చేసుకోవాలని.. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌ గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.