విజయనగరం మన్యంలోని పాచిపెంట మండలం చిల్లమామిడి గూడేనికి చెందిన పలువురు గిరిజనులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. వింత వ్యాధి బారినపడి మరణిస్తున్న ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బుధవారం సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి పరిస్థితిని తెలియజేశారు. గూడేనికి చెందిన ముఖి వెంకటి(55), ముఖి పెద్దమ్మి(45), సింబోయిన సింహాచలం, ముఖి అమ్మన్న, ముఖి కోతాయ్య, ముఖి గంగమ్మ, ముఖి అప్పలస్వామి, సింబోయిన చిన్నయ్య కొన్నిరోజుల్లోనే వరుసగా మరణించారని తెలిపారు. వెంటనే స్పందించాలని అధికారులను కోరారు. వ్యాధి లక్షణాల బట్టి మద్యం, మండి కల్లు తాగడం వల్ల శరీర భాగాలు పాడై, కాళ్లు, శరీరంపై వాపులు వచ్చి చనిపోతున్నారని గురివినాయుడుపేట పీహెచ్సీ వైద్యుడు ఎస్.రవిశంకర్ తెలిపారు. అయితే అది ఏ వ్యాధో నిర్ధారించాల్సి ఉందని, ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేస్తామన్నారు.
ఇదీ చదవండి: