ETV Bharat / state

ఏసీబీ వలకు చిక్కిన స్త్రీ-శిశు సంక్షేమశాఖ అధికారులు - acd latest rides news in kottavalasa

విజయనగరం జిల్లా కొత్తవలసలో ఇద్దరు అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. స్థానిక స్త్రీ-శిశు సంక్షేమశాఖ కార్యాలయ సీడీపీఓ మనమ్మ, సీనియర్ సహాయకుడు వేణుగోపాల్ లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/16-December-2019/5392965_acb.mp4
acb rides on icds and cdpo officers in vizianagaram district
author img

By

Published : Dec 17, 2019, 8:02 AM IST

ఏసీబీ వలకు చిక్కిన స్త్రీ-శిశు సంక్షేమశాఖ అధికారులు

విజయనగరం జిల్లా కొత్తవలస స్త్రీ-శిశు సంక్షేమశాఖ కార్యాలయ సీడీపీఓ మనమ్మ, సీనియర్ సహాయకుడు వేణుగోపాల్ ఏసీబీ వలకు చిక్కారు. కొత్తవలస ఐసీడీఏ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయలు సరఫరా చేస్తున్న ఏజెన్సీ నిర్వహకుడు సురేష్​ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయనకు బిల్లుల మంజూరు కోసం 85వేల రూపాయలు వీరిరువురూ డిమాండ్‌ చేశారు. కూరగాయల ఏజెన్సీ నిర్వహకుడు గత మూడు నెలలకు సంబంధించిన రూ.4.60 లక్షల బిల్లుల మంజూరు కోసం గత కొంత కాలంగా సీడీపీవో కార్యాలయం చుట్టు తిరుగుతున్నాడు. బిల్లును మంజూరు చేయాలంటే డబ్బు ఇవ్వాల్సిందేనని సీడీపీవో, సీనియర్ సహాయకుడు డిమాండ్ చేయటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఐసీడీఎస్ కార్యాలయంలో నగదు అందచేస్తుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు... సీడీపీవోతో పాటు సీనియర్ సహాయకుణ్ని పట్టుకున్నారు. వీరు ఇరువురిపై కేసు నమోదు చేసి విశాఖ ఏసీబీ కోర్టులు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. బిల్లుల మంజూరు, ఏజెన్సీ పునరుద్ధరణ కోసం సీడీపీవో లంచం కోసం భీష్మించటంతో విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు.

ఇదీ చూడండి: రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ

ఏసీబీ వలకు చిక్కిన స్త్రీ-శిశు సంక్షేమశాఖ అధికారులు

విజయనగరం జిల్లా కొత్తవలస స్త్రీ-శిశు సంక్షేమశాఖ కార్యాలయ సీడీపీఓ మనమ్మ, సీనియర్ సహాయకుడు వేణుగోపాల్ ఏసీబీ వలకు చిక్కారు. కొత్తవలస ఐసీడీఏ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయలు సరఫరా చేస్తున్న ఏజెన్సీ నిర్వహకుడు సురేష్​ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయనకు బిల్లుల మంజూరు కోసం 85వేల రూపాయలు వీరిరువురూ డిమాండ్‌ చేశారు. కూరగాయల ఏజెన్సీ నిర్వహకుడు గత మూడు నెలలకు సంబంధించిన రూ.4.60 లక్షల బిల్లుల మంజూరు కోసం గత కొంత కాలంగా సీడీపీవో కార్యాలయం చుట్టు తిరుగుతున్నాడు. బిల్లును మంజూరు చేయాలంటే డబ్బు ఇవ్వాల్సిందేనని సీడీపీవో, సీనియర్ సహాయకుడు డిమాండ్ చేయటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఐసీడీఎస్ కార్యాలయంలో నగదు అందచేస్తుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు... సీడీపీవోతో పాటు సీనియర్ సహాయకుణ్ని పట్టుకున్నారు. వీరు ఇరువురిపై కేసు నమోదు చేసి విశాఖ ఏసీబీ కోర్టులు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. బిల్లుల మంజూరు, ఏజెన్సీ పునరుద్ధరణ కోసం సీడీపీవో లంచం కోసం భీష్మించటంతో విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు.

ఇదీ చూడండి: రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.