ETV Bharat / state

వలస కూలీలకు ఆహారం పంపిణీ - ఎస్​కెఎమ్ఎల్ యూత్ తాజా వార్తలు

కరోనా సహాయక చర్యల్లో మేము సైతం అంటూ గ్రామీణ యువత ముందుకొస్తున్నారు. జాతీయ రహదారులపై నడిచి వెళ్తున్న వలస కూలీలకు, రోజువారీ కూలీలకు, నిరుపేదలకు ఆహారం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు విశాఖకు చెందిన యువత.

youth food packets distribution for migrate labours
వలస కూలీలకు ఆహార పంపిణీ చేసిన యువత
author img

By

Published : May 18, 2020, 2:05 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాం పంచాయతీలోని ఎస్​కెఎంఎల్ యూత్ ఆహారం పంపిణీ చేశారు. జాతీయ రహదారిపై కాలి నడకన వెళ్తున్న వలస కూలీలకు, వివిధ వాహనాలుపై స్వగ్రామాలకు చేరుతున్న వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను అందజేశారు. కరోనా సహాయక చర్యల్లో భాగంగా రెండు రోజులుగా వీరు ఈ సేవలందిస్తున్నారు. గ్రామంలో వంట చేయించి ప్యాకెట్లుగా తయారుచేసి పోలీసుల సహకారంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లి ఆహారం అందజేస్తున్నారు. జాతీయ రహదారిపై పోలిపల్లి, లింగాలవలస, తగరపువలస వంటి పలు ప్రాంతాల్లో వీరు ఆహారం పంపిణీ చేశారు.

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాం పంచాయతీలోని ఎస్​కెఎంఎల్ యూత్ ఆహారం పంపిణీ చేశారు. జాతీయ రహదారిపై కాలి నడకన వెళ్తున్న వలస కూలీలకు, వివిధ వాహనాలుపై స్వగ్రామాలకు చేరుతున్న వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను అందజేశారు. కరోనా సహాయక చర్యల్లో భాగంగా రెండు రోజులుగా వీరు ఈ సేవలందిస్తున్నారు. గ్రామంలో వంట చేయించి ప్యాకెట్లుగా తయారుచేసి పోలీసుల సహకారంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లి ఆహారం అందజేస్తున్నారు. జాతీయ రహదారిపై పోలిపల్లి, లింగాలవలస, తగరపువలస వంటి పలు ప్రాంతాల్లో వీరు ఆహారం పంపిణీ చేశారు.

ఇవీ చూడండి...

విశాఖ ఘటనపై ఎన్‌జీటీ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.