విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాం పంచాయతీలోని ఎస్కెఎంఎల్ యూత్ ఆహారం పంపిణీ చేశారు. జాతీయ రహదారిపై కాలి నడకన వెళ్తున్న వలస కూలీలకు, వివిధ వాహనాలుపై స్వగ్రామాలకు చేరుతున్న వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను అందజేశారు. కరోనా సహాయక చర్యల్లో భాగంగా రెండు రోజులుగా వీరు ఈ సేవలందిస్తున్నారు. గ్రామంలో వంట చేయించి ప్యాకెట్లుగా తయారుచేసి పోలీసుల సహకారంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లి ఆహారం అందజేస్తున్నారు. జాతీయ రహదారిపై పోలిపల్లి, లింగాలవలస, తగరపువలస వంటి పలు ప్రాంతాల్లో వీరు ఆహారం పంపిణీ చేశారు.
ఇవీ చూడండి...