విశాఖ జిల్లా చోడవరం మండలంలో 2వేల 145 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుంటారు. ఇప్పటికి 16 వందల 23 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. రైవాడ జలాశయం నీరు అందక అన్నవరం, సబ్బవరపుకళ్లాలు, రేవళ్లు తదితర ప్రాంతాల్లో వేసిన నాట్లను రక్షించుకునే పనిలో పడ్డారు రైతులు. బోర్లున్నచోట నీటిని అద్దెకు తెచ్చుకునే పనిలో రైతాంగం ఉంది. చోడవరం, అన్నవరం, సబ్బవరపు కళ్లాలలో నాట్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితిని చూసి మరికొన్ని ప్రాంతాల్లో వరినాట్లు వేయడం మానేసి.. భూములను ఖాళీగా వదిలేశారు.
ఇవీ చదవండి