ETV Bharat / state

విశాఖ రైల్వే కాలనీలో ఎంపీ పర్యటన

author img

By

Published : Dec 24, 2020, 4:57 PM IST

విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పర్యటించారు. నగరంలోని రైల్వే న్యూకాలనీలో నిర్మించిన ప్రహరీని పరిశీలించారు. వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉన్న ఆ గోడను తొలగిస్తామని హామీ ఇచ్చారు.

vizag-mp-mvv-sathyanarayana-tour-in-railway-colony
విశాఖ రైల్వే కాలనీలో ఎంపీ పర్యటన

విశాఖ నగరం 42వ వార్డు రైల్వే న్యూ కాలనీలో మూసివేసిన రహదారి ప్రాంతాన్ని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరిశీలించారు. కాలనీలోని పరదేశమ్మ గుడి వద్ద రైల్వే అధికారులు ప్రహరీ నిర్మించడంతో రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న ఎంపీ సత్యనారాయణ, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్, రైల్వే డీఆర్ఎం ను సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ సత్యనారాయణ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పనులు చేయబోమని స్పష్టం చేశారు.

విశాఖ నగరం 42వ వార్డు రైల్వే న్యూ కాలనీలో మూసివేసిన రహదారి ప్రాంతాన్ని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరిశీలించారు. కాలనీలోని పరదేశమ్మ గుడి వద్ద రైల్వే అధికారులు ప్రహరీ నిర్మించడంతో రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న ఎంపీ సత్యనారాయణ, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్, రైల్వే డీఆర్ఎం ను సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ సత్యనారాయణ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పనులు చేయబోమని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడ: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.