విశాఖ ఏజెన్సీ పెదబయలు సంత మన్యంలో ప్రముఖ వ్యాపార కేంద్రం ఒడిశాను ఆనుకుని ఉంటుంది. సమీప సరిహద్దుల్లో ఒడిశా వాసులు రావద్దని రెవెన్యూ పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెదబయలు మండల కేంద్రంలో ఉన్న అన్ని రకాల షాపులు సోమవారం మూసివేయాలని ప్రకటించారు. వర్తకులు అందరూ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ షేక్ హుస్సేన్, పోలీస్ ఎస్ఐ రాజారావు హెచ్చరించారు.
సోమవారం పెదబయలు మండలంలో పూర్తి లాక్డౌన్
లాక్డౌన్ 5.0లో ఇచ్చిన సడలింపులతో ప్రజలు గుంపులు గుంపులుగా బయటకు రావద్దని విశాఖ జిల్లా పెదబయలు మండల తహసీల్దార్ హుస్సేన్ హెచ్చరించారు. సోమవారం పెదబయలు మండలంలో అన్ని దుకాణాలు పూర్తిగా మూసేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
విశాఖ ఏజెన్సీ పెదబయలు సంత మన్యంలో ప్రముఖ వ్యాపార కేంద్రం ఒడిశాను ఆనుకుని ఉంటుంది. సమీప సరిహద్దుల్లో ఒడిశా వాసులు రావద్దని రెవెన్యూ పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెదబయలు మండల కేంద్రంలో ఉన్న అన్ని రకాల షాపులు సోమవారం మూసివేయాలని ప్రకటించారు. వర్తకులు అందరూ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ షేక్ హుస్సేన్, పోలీస్ ఎస్ఐ రాజారావు హెచ్చరించారు.
ఇదీ చూడండి
విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్ వార్.. పలువురికి తీవ్ర గాయాలు