ETV Bharat / state

రహదారిపై వరినాట్లు... వినూత్న రీతిలో నిరసన

"ఒకటా!..రెండా మేము పుట్టినప్పటి నుంచి మా ఊరికెళ్లే దారి బాగుపడలేదు. పైగా వర్షం కురిస్తే గోతుల్లో వర్షం నీరు, బురద. ఎన్నాళ్లు ఈ ఇబ్బందులు" అంటూ ఆ గ్రామ యువకులు వినూత్న రీతిలో నిరసన చేశారు. గ్రామానికి వెళ్లే రహదారిపై వరినాట్లు వేశారు. అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు వేయాలని కోరారు.

author img

By

Published : Aug 14, 2020, 11:30 PM IST

రహదారిపై వరినాట్లు... వినూత్న రీతిలో నిరసన
రహదారిపై వరినాట్లు... వినూత్న రీతిలో నిరసన

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం అయితంపూడి గ్రామానికి వెళ్లే రోడ్డు ఆధ్వానస్థితిలో ఉంది. గ్రామస్థులు పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, హామీలే తప్ప ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రహదారి దమ్ము చేసిన వరిపొలంగా తయారైంది. దీంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు రహదారిపై వరినాట్లు నాటి నిరసన తెలిపారు. కె.పి.అగ్రహారం నుంచి అయితంపూడికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం అయితంపూడి గ్రామానికి వెళ్లే రోడ్డు ఆధ్వానస్థితిలో ఉంది. గ్రామస్థులు పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, హామీలే తప్ప ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రహదారి దమ్ము చేసిన వరిపొలంగా తయారైంది. దీంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు రహదారిపై వరినాట్లు నాటి నిరసన తెలిపారు. కె.పి.అగ్రహారం నుంచి అయితంపూడికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రానికి 16 పోలీసు మెడల్స్..డీజీపీ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.