ETV Bharat / state

ఆధార్ నమోదుకు గిరిజనుల వెతలు.. 60 కి.మీ దూరంలో కేంద్రం - Tribal Peoples Faces Trouble For Aadhaar registration By Reaching 60 kms in Visakha Agency

విశాఖ జిల్లాలో ఆధార్‌ నమోదు చేసుకోవాలంటే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొందని దుప్పిలవాడ పంచాయతీకి చెందిన గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా పనులు మానుకుని వచ్చామని.. తిరిగి వెళ్లేసరికి చీకటి పడుతుండటంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆధార్ నమోదుకు గిరిజనుల వెతలు.. 60 కిమీ దూరంలో కేంద్రం
ఆధార్ నమోదుకు గిరిజనుల వెతలు.. 60 కిమీ దూరంలో కేంద్రం
author img

By

Published : Jun 19, 2021, 10:07 PM IST

విశాఖ జిల్లాలోని దుప్పిలవాడ పంచాయతీకి చెందిన గిరిజనులు తమకు ఆధార్ నమోదు చేయాలన్నా, ఫోన్​ నంబరుతో అనుసంధానం చేయాలన్నా సుదూరం వెళ్లాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్‌ నమోదు చేసుకోవాలంటే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ కొమ్ములవాడ గ్రామస్థులు రామారావు, సన్యాసిరావు, సత్యనారాయణ తదితరులు ఆధార్‌, ఫోన్‌ నంబరు అనుసంధానం కోసం చింతపల్లి తరలివచ్చారు. రోజంతా పనులు మానుకుని వచ్చామని.. తిరిగి వెళ్లేసరికి చీకటి పడుతుండటంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వారి చొరవతో పూర్తైంది..

కర్ఫ్యూ అమల్లో ఉండటంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందులకు గురయ్యామన్నారు. ఏఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు చొరవతో త్వరితగతిన అధార్‌ అనుసంధానం పూర్తైందని బాధితులు పేర్కొన్నారు. మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులు ఆధార్‌ నమోదు, అనుసంధానం కోసం ఇబ్బందులు పడుతున్నారని గ్రామ వాలంటీర్ జగ్గారావు వివరించారు. ధారకొండ పంచాయతీ కేంద్రంలో ఆధార్‌ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తే.. చుట్టుపక్కల 4 పంచాయతీల పరిధిలోని 150 గ్రామాల గిరిజనులకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు ఐటీడీఏ అధికారులు చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : Devineni: 'దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచేస్తున్నారు'

విశాఖ జిల్లాలోని దుప్పిలవాడ పంచాయతీకి చెందిన గిరిజనులు తమకు ఆధార్ నమోదు చేయాలన్నా, ఫోన్​ నంబరుతో అనుసంధానం చేయాలన్నా సుదూరం వెళ్లాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్‌ నమోదు చేసుకోవాలంటే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ కొమ్ములవాడ గ్రామస్థులు రామారావు, సన్యాసిరావు, సత్యనారాయణ తదితరులు ఆధార్‌, ఫోన్‌ నంబరు అనుసంధానం కోసం చింతపల్లి తరలివచ్చారు. రోజంతా పనులు మానుకుని వచ్చామని.. తిరిగి వెళ్లేసరికి చీకటి పడుతుండటంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వారి చొరవతో పూర్తైంది..

కర్ఫ్యూ అమల్లో ఉండటంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందులకు గురయ్యామన్నారు. ఏఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు చొరవతో త్వరితగతిన అధార్‌ అనుసంధానం పూర్తైందని బాధితులు పేర్కొన్నారు. మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులు ఆధార్‌ నమోదు, అనుసంధానం కోసం ఇబ్బందులు పడుతున్నారని గ్రామ వాలంటీర్ జగ్గారావు వివరించారు. ధారకొండ పంచాయతీ కేంద్రంలో ఆధార్‌ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తే.. చుట్టుపక్కల 4 పంచాయతీల పరిధిలోని 150 గ్రామాల గిరిజనులకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు ఐటీడీఏ అధికారులు చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : Devineni: 'దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచేస్తున్నారు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.