ETV Bharat / state

అధికారుల ప్రవర్తనతో విసిగి... చందాలు వేసుకుని..!

author img

By

Published : Feb 27, 2021, 7:50 PM IST

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో సరైన రహదారులు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో స్వయంగా రోడ్డు నిర్మించుకునేందుకు ముందడుగు వేశారు.

tribal construct road for their village with officers negligence in manyam vizag district
స్యయంగా రోడ్డును నిర్మించుకుంటున్న గ్రామస్థులు

విశాఖ జిల్లా పాడేరు మండలం మారుమూల గ్రామం సలుగు పంచాయతీ పరిధిలోని బిడారిగరువులో ఏళ్ల తరబడిగా రహదారి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. గ్రామస్తులందరూ చందాలు వేసుకుని మూడు కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించుకునేందుకు సమాయత్తమయ్యారు. జేసీబీ సహాయంతో కొండ మార్గాన్ని చదును చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

విశాఖ జిల్లా పాడేరు మండలం మారుమూల గ్రామం సలుగు పంచాయతీ పరిధిలోని బిడారిగరువులో ఏళ్ల తరబడిగా రహదారి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. గ్రామస్తులందరూ చందాలు వేసుకుని మూడు కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించుకునేందుకు సమాయత్తమయ్యారు. జేసీబీ సహాయంతో కొండ మార్గాన్ని చదును చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీచదవండి

స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేఖలు రాస్తేనే సరిపోదు: సీపీఐ నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.