ETV Bharat / state

'వాలంటీర్ల సేవా పురస్కారాల అవార్డుల ఎంపికలో అన్యాయం' - rolugunta volunteers news

వాలంటీర్ల సేవా పురస్కారాల అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందని విశాక జిల్లా రోలుగుంట మండలానికి చెందిన పలువురు వాలంటీర్లు ఆరోపించారు. తాము కూడా అవార్డులకు అర్హులమేనంటూ ఓ జాబితాను ఎంపీడీవోకు అందజేశారు.

vishakha volunteers news
రోలుగుంట ఎంపీటీవోకు వాలంటీర్ల వినతిపత్రం
author img

By

Published : Apr 16, 2021, 6:55 AM IST

రాష్ట్రంలోని ఇటీవల జరిగిన వాలంటీర్ల సేవా పురస్కారాల అవార్డు ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని విశాఖ జిల్లా రోలుగుంట మండలానికి చెందిన పలువురు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రోలుగుంట ఎంపీడీవో ప్రభాకరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

రోలుగుంట మండలానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో సేవా మిత్ర , సేవ రత్న , సేవా వజ్ర కేటగిరీల కింద సుమారు 202 మందిని ఎంపిక చేశారు. తాము కూడా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నామని ఆ పురస్కారాలు పొందడానికి అర్హులమేనని వివిధ పంచాయతీలకు చెందిన పలువురు వారి పేర్ల జాబితాను అధికారులకు అందజేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రోలుగుంట ఎంపీడీవో కే. ప్రభాకర రావు వారికి హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని ఇటీవల జరిగిన వాలంటీర్ల సేవా పురస్కారాల అవార్డు ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని విశాఖ జిల్లా రోలుగుంట మండలానికి చెందిన పలువురు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రోలుగుంట ఎంపీడీవో ప్రభాకరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

రోలుగుంట మండలానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో సేవా మిత్ర , సేవ రత్న , సేవా వజ్ర కేటగిరీల కింద సుమారు 202 మందిని ఎంపిక చేశారు. తాము కూడా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నామని ఆ పురస్కారాలు పొందడానికి అర్హులమేనని వివిధ పంచాయతీలకు చెందిన పలువురు వారి పేర్ల జాబితాను అధికారులకు అందజేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రోలుగుంట ఎంపీడీవో కే. ప్రభాకర రావు వారికి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ కుటుంబం మృతి కేసులో ట్విస్ట్.. పెద్ద కుమారుడే ఘటనకు కారణమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.