విశాఖ జిల్లా యస్ రాయవరం అడ్డురోడ్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో ప్రయాణిస్తున్న ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ సమీప గ్రామాలైన గోకులపాడు, దార్లపూడిలకు చెందిన వారు. రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి-ఫొనిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన నౌకాదళం