ETV Bharat / state

ప్రముఖ రచయిత రామతీర్థ గుండెపోటుతో కన్నుమూత - undefined

ప్రముఖ రచయిత, అనువాదకులు రామతీర్థ గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖలో శనివారం భారీఎత్తున జరగనున్న కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి సభల ఏర్పాట్లలో ఉండగా, ఒక్కసారిగా అస్వస్థతతో రామతీర్థ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

గుండెపోటుతో మరణించిన ప్రముఖ రచయిత రామతీర్థ
author img

By

Published : May 31, 2019, 5:18 PM IST

ప్రముఖ రచయిత రామతీర్థ గుండెపోటుతో కన్నుమూత

ప్రముఖ రచయిత, అనువాదకుడు రామతీర్థ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. జూన్‌ 1న ఆంధ్రా వర్శిటీలో జరిగే కందుకూరి శతవర్థంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమైన రామతీర్థ గుండెపోటుతో కన్నుమూశారు. రామతీర్థ ఆకస్మిక మరణం రెండు తెలుగు రాష్ట్రాలలోని రచయితలు, సాహితీవేత్తలు, కవులను విషాదంలో ముంచివేసింది.

యాబులూరు సుందర రాంబాబు.. ఈ పేరు చాలామందికి కొత్తగా ఉండవచ్ఛు కానీ రామతీర్థ అంటే తెలియని సాహితీవేత్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఈయన గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో గుండెపోటుతో మరణించారు. ఈయనకు భార్య కామేశ్వరి, కుమారుడు క్రాంతికిరణ్‌, కుమార్తె కవిత ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌లో ఉంటుండగా.. కుమార్తె అమెరికాలో ఉన్నారు. భార్య కామేశ్వరి కుమారుని వద్ద హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈయన 1993లో రాసిన తెల్లమిరియ పుస్తకంతో సాహితీలోకంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పటినుంచి ఈయన పలు రచనలు చేపట్టారు. విశాఖ సాహితికి పలు సేవలందించారు.

అరసం, విరసం సభ్యులు కానప్పటికీ వామపక్ష భావాలు కలిగిన రామతీర్ధ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య, సాన్నిహిత్యాన్ని తెలియని కవులు, రచయితలు లేరంటే అతిశయోక్తికాదు. ఈయన ప్రపంచ సాహిత్య చరిత్ర, రచనలు అన్నీ తెలిసిన విజ్ఞానిగా రచయితలు భావిస్తారు. ఈయన జగద్ధాత్రితో కలసి మొజాయిక్‌ సాహితీ సంస్థ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురు రచయితలను తాము నిర్వహిస్తున్న మొజాయిక్‌ సాహిత్య సంస్థ ద్వారా సత్కరించడం, కవితాగోష్టులు నిర్వహించడం వంటివి చేశారు. ఈయన మరణవార్త తెలిసి నగరంలో కవులు, రచయితలు, సాహితీ ప్రియులు కేర్‌ ఆసుపత్రికి చేరుకొని నివాళులు అర్పించారు. అమెరికాలో ఉన్న కుమార్తె శనివారం నాటికి చేరుకుంటారని.. చెబుతున్నారు. కుటింబీకులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది నిర్ణయిస్తారంటున్నారు. .

మండే మొజాయిక్‌..
మొజాయిక్‌ అనే సాహిత్య సంస్థను నెలకొల్పి మండే మొజాయిక్‌ పేరిట ప్రతీ సోమవారం సాహిత్య సమావేశాలు నిర్వహిస్తూ ప్రపంచ సాహిత్యాన్ని అందించే ప్రముఖ సాహితీవేత్తగా ప్రత్యేక ముద్రను చాటారు రామతీర్థ. స్వతహాగా వామపక్ష భావజాలాలను ఇష్టపడే రామతీర్థ వ్యాసం, కవిత్వం, అనువాదం ఏదైనా తనదైన మార్కుతో మొదటి పంక్తుల్లోనే సాహిత్యాభిమానుల్ని ఆకట్టుకునేవారు. సమకాలీన తెలుగు సాహిత్యరంగంలో క్రియాశీలంగా ఉండి పదునైన సాహిత్య విమర్శకులుగా పేరొందారు. గత ఏడాది ఏయూలో ప్రపంచ సాహితీ సదస్సులు నిర్వహించారు. ఆయనకు అనేక సాహితీ పురస్కారాలు లభించాయి.

ఇవీ చదవండి

వైద్యంతో పాటు.. ధూమపానంపై అవగాహన

ప్రముఖ రచయిత రామతీర్థ గుండెపోటుతో కన్నుమూత

ప్రముఖ రచయిత, అనువాదకుడు రామతీర్థ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. జూన్‌ 1న ఆంధ్రా వర్శిటీలో జరిగే కందుకూరి శతవర్థంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమైన రామతీర్థ గుండెపోటుతో కన్నుమూశారు. రామతీర్థ ఆకస్మిక మరణం రెండు తెలుగు రాష్ట్రాలలోని రచయితలు, సాహితీవేత్తలు, కవులను విషాదంలో ముంచివేసింది.

యాబులూరు సుందర రాంబాబు.. ఈ పేరు చాలామందికి కొత్తగా ఉండవచ్ఛు కానీ రామతీర్థ అంటే తెలియని సాహితీవేత్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఈయన గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో గుండెపోటుతో మరణించారు. ఈయనకు భార్య కామేశ్వరి, కుమారుడు క్రాంతికిరణ్‌, కుమార్తె కవిత ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌లో ఉంటుండగా.. కుమార్తె అమెరికాలో ఉన్నారు. భార్య కామేశ్వరి కుమారుని వద్ద హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈయన 1993లో రాసిన తెల్లమిరియ పుస్తకంతో సాహితీలోకంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పటినుంచి ఈయన పలు రచనలు చేపట్టారు. విశాఖ సాహితికి పలు సేవలందించారు.

అరసం, విరసం సభ్యులు కానప్పటికీ వామపక్ష భావాలు కలిగిన రామతీర్ధ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య, సాన్నిహిత్యాన్ని తెలియని కవులు, రచయితలు లేరంటే అతిశయోక్తికాదు. ఈయన ప్రపంచ సాహిత్య చరిత్ర, రచనలు అన్నీ తెలిసిన విజ్ఞానిగా రచయితలు భావిస్తారు. ఈయన జగద్ధాత్రితో కలసి మొజాయిక్‌ సాహితీ సంస్థ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురు రచయితలను తాము నిర్వహిస్తున్న మొజాయిక్‌ సాహిత్య సంస్థ ద్వారా సత్కరించడం, కవితాగోష్టులు నిర్వహించడం వంటివి చేశారు. ఈయన మరణవార్త తెలిసి నగరంలో కవులు, రచయితలు, సాహితీ ప్రియులు కేర్‌ ఆసుపత్రికి చేరుకొని నివాళులు అర్పించారు. అమెరికాలో ఉన్న కుమార్తె శనివారం నాటికి చేరుకుంటారని.. చెబుతున్నారు. కుటింబీకులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది నిర్ణయిస్తారంటున్నారు. .

మండే మొజాయిక్‌..
మొజాయిక్‌ అనే సాహిత్య సంస్థను నెలకొల్పి మండే మొజాయిక్‌ పేరిట ప్రతీ సోమవారం సాహిత్య సమావేశాలు నిర్వహిస్తూ ప్రపంచ సాహిత్యాన్ని అందించే ప్రముఖ సాహితీవేత్తగా ప్రత్యేక ముద్రను చాటారు రామతీర్థ. స్వతహాగా వామపక్ష భావజాలాలను ఇష్టపడే రామతీర్థ వ్యాసం, కవిత్వం, అనువాదం ఏదైనా తనదైన మార్కుతో మొదటి పంక్తుల్లోనే సాహిత్యాభిమానుల్ని ఆకట్టుకునేవారు. సమకాలీన తెలుగు సాహిత్యరంగంలో క్రియాశీలంగా ఉండి పదునైన సాహిత్య విమర్శకులుగా పేరొందారు. గత ఏడాది ఏయూలో ప్రపంచ సాహితీ సదస్సులు నిర్వహించారు. ఆయనకు అనేక సాహితీ పురస్కారాలు లభించాయి.

ఇవీ చదవండి

వైద్యంతో పాటు.. ధూమపానంపై అవగాహన

Intro:ap_rjy_36_31_panchayath_voters_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్


Body:పంచాయతీ పోరుకు సిద్ధమౌతున్న గ్రామాలు


Conclusion:సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నిక లు ముగియడంతో అధికారులు పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో మొత్తం 63 పంచాయతీలు 722 వార్డు ఉండగా రెండు లక్షల 9360 మంది ఓటర్లు ఉన్నారు ఇప్పటికే ఇందుకు సంబంధించి ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు గత నెలలో జాబితాను విడుదల చేసి మార్పులు చేర్పులకు అవకాశం కల్పించడంతో కులాల వారిగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి దాని ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వ సన్నద్ధమైంది కటికే ఇందుకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించిన అధికారులు ముసాయిదా జాబితాను విడుదల చేయగా వాటిని ప్రతి పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు ఇందులో కూడా ఏదైనా పొరపాటు జరిగినా సరిదిద్దేందుకు వచ్చే నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు దీంతో ప్రస్తుతం గ్రామాల్లో పంచాయితీ వేడి పుంజుకుంది గత ప్రభుత్వం చాలా వరకు పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించగా సిబ్బంది కొరత మాత్రం తీరలేదు ఒక్కో పంచాయతీకి పదిమంది ఇది సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒకరిద్దరితో సరిపుచ్చుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను నడిపేందుకు కూడా సిబ్బంది లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది నూతన ప్రభుత్వం ప్రతి పంచాయతీలో ఉద్యోగుల నియమిస్తానని తెలిపి నా పారిశుధ్యకార్మికులుగా పని చేసేవారు ఎంతమంది ఉంటారు అనేది ప్రశ్నార్థకంగా మారింది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.