ETV Bharat / state

"కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" - నర్సీ పట్నం ఆర్డీఓ

లాక్​డౌన్​లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీజ్యోతి తెలిపారు. డివిజన్​లో కరోనా వ్యాప్తి లేకున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

"People should be vigilant on Corona"
"కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి"
author img

By

Published : Mar 28, 2020, 4:03 PM IST

"కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి"

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లో నిత్యావసరాల పంపిణీకి ప్రతి మండల పరిధిలో రేషన్ డీలర్లను, వీఆర్వోలను అప్రమత్తం చేశామని ఆర్డీఓ లక్ష్మీ శివ జ్యోతి తెలిపారు. డివిజన్ పరిధిలో కరోనా విజృంభించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి డివిజన్​లోకి వచ్చే వారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. నర్సీపట్నం డివిజన్ లో కరోనా వ్యాప్తి అంతగా లేకపోయిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.

ఇదీ చూడండి:'ఆశ‌తో నడుస్తున్నాం... కానీ ఏమవుతుందో..?'

"కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి"

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లో నిత్యావసరాల పంపిణీకి ప్రతి మండల పరిధిలో రేషన్ డీలర్లను, వీఆర్వోలను అప్రమత్తం చేశామని ఆర్డీఓ లక్ష్మీ శివ జ్యోతి తెలిపారు. డివిజన్ పరిధిలో కరోనా విజృంభించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి డివిజన్​లోకి వచ్చే వారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. నర్సీపట్నం డివిజన్ లో కరోనా వ్యాప్తి అంతగా లేకపోయిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.

ఇదీ చూడండి:'ఆశ‌తో నడుస్తున్నాం... కానీ ఏమవుతుందో..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.