విశాఖలో రాష్ట్రస్థాయి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. అక్కయ్యపాలెం కల్యాణ మండపంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 190 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 55 కిలోల నుంచి 80 కిలోల పైబడిన విభాగాల్లో తలపడ్డారు. రిఫరీలు అడిగిన భంగిమలు పెడుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఏపీ బాడీబిల్డర్ల సంఘం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా.. రాష్ట్ర సంఘం ఛైర్మన్ నాగేశ్వరరావు, ఇతర జిల్లా సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రామతీర్ధంలో ప్రజలు సంయమనంపై విశాఖ రేంజి డీఐజీ సంతృప్తి