ETV Bharat / state

VIJAYSAI REDDY: రాష్ట్రానికి కేంద్రం ద్రోహం చేస్తోంది: విజయసాయిరెడ్డి

author img

By

Published : Jul 18, 2021, 3:56 PM IST

Updated : Jul 19, 2021, 3:22 AM IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేస్తున్నామని అఖిలపక్ష సమావేశంలో మరో సారి స్పష్టం చేశామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏడేళ్లయినా విభజన హామీలు రాష్ట్రంలో ఇంకా పూర్తిగా అమలు కాలేదన్నారు. ఏపీపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ, పక్షపాత దోరణి అని అన్నారు.

vijayasaireddy
విజయసాయిరెడ్డి

అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటే భాజపా ఎంతకైనా దిగజారుతుందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. భాజపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. ఈ పక్షపాత ధోరణి పనికిరాదని సమావేశంలో స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు.

పుదుచ్చేరి ఎన్నికల సమయంలో భాజపా మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎలా పెట్టారని అఖిలపక్ష సమావేశంలో మంత్రులను ప్రశ్నించినట్లు తెలిపారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వలేరని, భాజపా రాష్ట్రాలకు ఏమైనా చేస్తారు, భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మొండిచేయి చూపుతారని చెప్పామన్నారు. పోలవరం పునరావాస ప్యాకేజీకి రూ.55,657 కోట్లు రావాల్సి ఉన్నా కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సాంకేతిక కమిటీ ఆమోదించినా నిధులు పెండింగ్‌లో పెట్టడం రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తరలించాలని కోరినా స్పందించనందున ఈ అంశాన్ని ఉభయసభల్లో ప్రస్తావిస్తామని తెలియజేశామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం కాల పరిమితి పదేళ్లయితే ఇప్పటికే ఎనిమిదేళ్లయినా చాలా హామీలు నెరవేర్చలేదనే విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని పునర్విభజన చట్టంలో పొందుపర్చినా భాజపా ప్రభుత్వం ఆ చట్టానికి లోబడకుండా తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, బియ్యం రాయితీ కింద రూ.5,056 కోట్లు, ఉపాధిహామీ నిధులు రూ.6,750 కోట్లు బకాయిపడినందున ఆ మొత్తం విడుదల చేయాలని కోరామన్నారు. వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై గెజిట్‌ విడుదల చేయాలని, దిశ బిల్లును ఆమోదించాలని కోరినట్లు చెప్పారు. పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధుల విషయంలో భాజపా ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆయన ఆరోపించారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఇతర రాష్ట్రాల్లో 70 నుంచి 75 శాతం మందికి రేషన్‌ కార్డులు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 60 శాతం మందికి లేవని, ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కోరామన్నారు.

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసిందని, అందుకు చెల్లించాల్సిన రూ.6,112 కోట్లను తెలంగాణ ఇవ్వనందున కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సీఆర్‌డీఏ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్‌, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరితే కేంద్రం స్పందించని తీరును తెలియజేశామన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో కేంద్రప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శరద్‌యాదవ్‌కు నోటీసు ఇచ్చి వారం రోజుల్లోపే అనర్హత వేటు వేశారని, వైకాపా ఏడాది క్రితం ఒకరిపై అనర్హత పిటిషన్‌ పెడితే 11నెలల తర్వాత సభాపతి ఆ పిటిషన్‌లో లోపాలున్నాయని, సరి చేయాలని చెప్పారన్నారు.

ఫిరాయింపుల విషయంలో మూడు నెలల నుంచి ఆరు నెలల్లోపే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయని తెలిపారు. భాజపాకు అనుకూలంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయడం దుర్మార్గమన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.11 వేల కోట్లు ఇవ్వాలని అభ్యర్థించినట్లు చెప్పారు. ఆయా అంశాలను సభలో లేవనెత్తుతామని, అవసరమైతే నిరసన తెలియజేస్తామని తెలిపారు. తెదేపా ఎంపీల రాజీనామాల సవాలుపై ప్రశ్నించగా రాజీనామాలు చేసి ఏం సాధిస్తారని, అధికారంలో ఉన్నప్పుడు ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.

వైకాపా లోక్‌సభ పక్ష నేత మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని చాలా అంశాలు అమలు కానందున వాటిపై స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని కోరినట్లు తెలిపారు. మీరు లేవనెత్తే అంశాలకు సమాధానమిస్తామని ఆయన చెప్పారన్నారు. ఏ ఒక్క అంశాన్నీ వదిలేందుకు సిద్ధంగా లేమని, రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పార్లమెంటులో రాష్ట్ర వాణిని వినిపిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి

RRR: 3 రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై అమిత్ షాకు ఎంపీ రఘురామ లేఖ

వైకాపా ఎంపీలు రాజీనామా చేసి పోరాడాలి: ఎంపీ కనకమేడల

అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటే భాజపా ఎంతకైనా దిగజారుతుందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. భాజపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. ఈ పక్షపాత ధోరణి పనికిరాదని సమావేశంలో స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు.

పుదుచ్చేరి ఎన్నికల సమయంలో భాజపా మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎలా పెట్టారని అఖిలపక్ష సమావేశంలో మంత్రులను ప్రశ్నించినట్లు తెలిపారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వలేరని, భాజపా రాష్ట్రాలకు ఏమైనా చేస్తారు, భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మొండిచేయి చూపుతారని చెప్పామన్నారు. పోలవరం పునరావాస ప్యాకేజీకి రూ.55,657 కోట్లు రావాల్సి ఉన్నా కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సాంకేతిక కమిటీ ఆమోదించినా నిధులు పెండింగ్‌లో పెట్టడం రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తరలించాలని కోరినా స్పందించనందున ఈ అంశాన్ని ఉభయసభల్లో ప్రస్తావిస్తామని తెలియజేశామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం కాల పరిమితి పదేళ్లయితే ఇప్పటికే ఎనిమిదేళ్లయినా చాలా హామీలు నెరవేర్చలేదనే విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని పునర్విభజన చట్టంలో పొందుపర్చినా భాజపా ప్రభుత్వం ఆ చట్టానికి లోబడకుండా తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, బియ్యం రాయితీ కింద రూ.5,056 కోట్లు, ఉపాధిహామీ నిధులు రూ.6,750 కోట్లు బకాయిపడినందున ఆ మొత్తం విడుదల చేయాలని కోరామన్నారు. వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై గెజిట్‌ విడుదల చేయాలని, దిశ బిల్లును ఆమోదించాలని కోరినట్లు చెప్పారు. పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధుల విషయంలో భాజపా ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆయన ఆరోపించారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఇతర రాష్ట్రాల్లో 70 నుంచి 75 శాతం మందికి రేషన్‌ కార్డులు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 60 శాతం మందికి లేవని, ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కోరామన్నారు.

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసిందని, అందుకు చెల్లించాల్సిన రూ.6,112 కోట్లను తెలంగాణ ఇవ్వనందున కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సీఆర్‌డీఏ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్‌, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరితే కేంద్రం స్పందించని తీరును తెలియజేశామన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో కేంద్రప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శరద్‌యాదవ్‌కు నోటీసు ఇచ్చి వారం రోజుల్లోపే అనర్హత వేటు వేశారని, వైకాపా ఏడాది క్రితం ఒకరిపై అనర్హత పిటిషన్‌ పెడితే 11నెలల తర్వాత సభాపతి ఆ పిటిషన్‌లో లోపాలున్నాయని, సరి చేయాలని చెప్పారన్నారు.

ఫిరాయింపుల విషయంలో మూడు నెలల నుంచి ఆరు నెలల్లోపే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయని తెలిపారు. భాజపాకు అనుకూలంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయడం దుర్మార్గమన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.11 వేల కోట్లు ఇవ్వాలని అభ్యర్థించినట్లు చెప్పారు. ఆయా అంశాలను సభలో లేవనెత్తుతామని, అవసరమైతే నిరసన తెలియజేస్తామని తెలిపారు. తెదేపా ఎంపీల రాజీనామాల సవాలుపై ప్రశ్నించగా రాజీనామాలు చేసి ఏం సాధిస్తారని, అధికారంలో ఉన్నప్పుడు ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.

వైకాపా లోక్‌సభ పక్ష నేత మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని చాలా అంశాలు అమలు కానందున వాటిపై స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని కోరినట్లు తెలిపారు. మీరు లేవనెత్తే అంశాలకు సమాధానమిస్తామని ఆయన చెప్పారన్నారు. ఏ ఒక్క అంశాన్నీ వదిలేందుకు సిద్ధంగా లేమని, రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పార్లమెంటులో రాష్ట్ర వాణిని వినిపిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి

RRR: 3 రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై అమిత్ షాకు ఎంపీ రఘురామ లేఖ

వైకాపా ఎంపీలు రాజీనామా చేసి పోరాడాలి: ఎంపీ కనకమేడల

Last Updated : Jul 19, 2021, 3:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.