ETV Bharat / state

విశాఖలో నగదు హవాలాకు యత్నం..వ్యక్తి అరెస్టు - నగదు హవాలా

నగదు హవాలాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్​లో టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనతి వద్ద నుంచి 50 లక్షల 38 వేల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

నగదు హవాలాకు యత్నం..వ్యక్తి అరెస్టు !
నగదు హవాలాకు యత్నం..వ్యక్తి అరెస్టు !
author img

By

Published : Jun 28, 2020, 3:08 PM IST

విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్​లో అనధికారికంగా నగదు బదిలీ లావాదేవీలు (హవాలా) జరిపేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన గ్రంధి నరసింహారావు అనే వ్యక్తి నిన్న రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బ్యాగులో నగదుతో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ వ్యక్తి హవాలా ద్వారా అనధికారికంగా నగదు లావాదేవీలను జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి 50 లక్షల 38 వేల నగదును టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్​కి తరలించి కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ బంగారం వ్యాపారి వద్ద నరసింహారావు గుమస్తాగా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్​లో అనధికారికంగా నగదు బదిలీ లావాదేవీలు (హవాలా) జరిపేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన గ్రంధి నరసింహారావు అనే వ్యక్తి నిన్న రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బ్యాగులో నగదుతో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ వ్యక్తి హవాలా ద్వారా అనధికారికంగా నగదు లావాదేవీలను జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి 50 లక్షల 38 వేల నగదును టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్​కి తరలించి కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ బంగారం వ్యాపారి వద్ద నరసింహారావు గుమస్తాగా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.