విశాఖ జిల్లా పాయకరావుపేటలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, పప్పులను రేషన్ డిపోలో పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 (కరోనా వైరస్) నివారణకు అధికారులంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.
'సమిష్టి కృషితోనే కరోనా నియంత్రణ' - Minister Avanti visit to Payakaraopeta
విశాఖ జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, పప్పులను రేషన్ డిపోలో పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

విశాఖ జిల్లా పాయకరావుపేటలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, పప్పులను రేషన్ డిపోలో పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 (కరోనా వైరస్) నివారణకు అధికారులంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: యాచకులకు ఆహార పొట్లాలు అందించిన తాడిపత్రి డీఎస్పీ